Wednesday, May 24, 2017

ఆపదలకు చింతిందేది సామాన్యులే


ఆపదలకు చింతిందేది సామాన్యులే




సాహితీమిత్రులారా!



ఎటువంటి ఆపదలు పైన బడినా ధైర్యం వీడక
ఉండేవారు సామాన్యులుకాదు మహాత్ములు అని
తెలిపే శ్లోకం చూడండి-
ఇది భర్తృహరి నీతిశతకంలోనిది-

విరమ విరమాయాసా దస్మా ద్దురధ్యవసాయతో
విపది మహతాం ధైర్యధ్వంసం య దీక్షితు మీహసే
అయి జడవిధే, కల్పాపాయే2ప్యపేతనిజక్రమాః
కులశిఖరిణః క్షుద్రా వైతే న వా జలరాశయః

కుల పర్వతాలు - 7
మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత,
ఋక్ష, పారియాత్రము - అనేవి కులపర్వతాలు
సముద్రాలు - 7
దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల
అనేవి సప్తసముద్రాలు
కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా,
ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా
మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా
వారి ధైర్యాన్ని విడనాడరు- అని భావం.

దీనికే ఏనుగు లక్ష్మణకవి గారి అనువాదం-

దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం
బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ
వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై
ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్

No comments:

Post a Comment