Thursday, May 11, 2017

రామభద్రుని సంధ్యారాగం


రామభద్రుని సంధ్యారాగం




సాహితీమిత్రులారా!

అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయంలోని
సంధ్యారాగం చూడండి-

కవికల్పనకు అంతుండదేమో
ఒక్కొక్కరికి ప్రకృతి ఒక్కొక్కలా
కనిపిస్తుంది దాన్ని వారు వర్ణించే
విధానం మహాద్భుతం
ఇక్కడ అచ్చతెలుగుపలుకులతో
ఒలికిన కవిత చూడండి-

తొట్టుకొని సంజ కెం ప
ప్పట్టున రవి బాసి సితగభస్తి నెదురుకో
నట్టె సిరి వచ్చుటకునై
పట్టిన కెంబట్టు దిడ్డి పాలకిఁ బోలెన్
                                                 (రామాభ్యుదయము - 2- 92)

ఎర్రదనం పడమటి దిక్కున అఏంతటా వ్యాపించి ఉంది.
అది ఎలావుందంటే ఎర్రటి పట్టుతెరలు కట్టిన పల్లకిలా
ఉందని అయ్యలరాజు రామభద్రుని ఊహ.

ఈ ఎర్రటి పల్లకీ ఎవరికోసం పుట్టిందంటే - చెబుతున్నాడు
సూర్యుని పని అయిపోయింది. అస్తమించాడు లేదా
అధికారం కోల్పోయాడు. ఇప్పటిదాకా అతన్ని వెన్నంటి ఉన్నశోభ
తక్షణం అతణ్ని విడిచి పెట్టేసింది. ఇలా రవిని విడిచి లేదా
వీడ్కోలు పలికి ఆ శోభ ఇప్పుడింకా పుట్టని అధికారంలోనిరాని
ఉదయించబోతున్న తెల్లనికిరణాల చంద్రుణ్ని ఆహ్వానించడానికి
ఎదురుకోలు పలకడానికి త్వరగా అట్టే తూర్పు దిక్కురావాలి.
సిరి అలా తరలిరావడం కోసం సిద్ధపరచిన ఎర్రతెరల పల్లకీలా
ఉంది ఈ సంజెకెంపు- అని భావం.

ఏమి ఊహ.............. ఏమి ఊహ.......

No comments:

Post a Comment