Tuesday, May 2, 2017

ఆ విషయం కలిమిలేములే నిర్ణయిస్తాయి


ఆ విషయం కలిమిలేములే నిర్ణయిస్తాయి




సాహితీమిత్రులారా!


లోకంలోని ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది.
అది మన దగ్గరున్న సంపదను బట్టి ఉంటుంది.
అదే విషయాన్ని తెలిపే ఈ శ్లోకం చూడండి-
ఇది భర్తృహరి నీతిశతకంలోనిది.

పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే
స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం
అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా
మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ

ఇ ది ఎంత చిత్రమైనదంటే ---------
ఒకప్పుడు ఆపత్కాలంలో
అతి సామాన్యమైనవస్తువే
పెన్నిధిగా తోచవచ్చు
అదే వస్తువుసంపదలొచ్చిన వేళ
అల్పంగా అనిపించ వచ్చు

ఉదాహరణకు - దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు
గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు
కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు
భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు
సమయాన్ని బట్టి- ఒకప్పుడు అధికమైనది
మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా
తోచడం జరుగుతుంది.

No comments:

Post a Comment