Wednesday, May 10, 2017

సురుచిర తారకాకుసుమ శోభి


సురుచిర తారకాకుసుమ శోభి




సాహితీమిత్రులారా!


వర్ణనలలో ప్రబంధ పరమేశ్వరుని
సంధ్యారాగ వర్ణన చూద్దాం-
ప్రబంధాలకు మూలమైన
వర్ణననలు చేసిన ఎఱ్ఱాప్రెగ్గడవారి
నృసింహపురాణంలోని ఈ పద్యం చూద్దాం-
సంధ్యాసమయంలో
పశ్చిమదిక్కున వ్యాపించే ఎర్రదనాన్ని
సంధ్యారాగం అంటారు.
ఇక్కడ కవిగారి ఊహను చూడండి
ఎంత అద్భుతంగా ఉందో-

సురుచిరతారకాకుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముఁగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁ బెం
దెరయన నొప్పు సాంధ్య నవ దీధితి పశ్చిమ దిక్తతటంబు నన్
                                                                                  (నృసింహపురాణము -3-78)

ఆకాశం అనే వేదిక కాంతిమంతాలైన నక్షత్రాలనే పువ్వులతో
అలంకరింపబడి ఒప్పెసలారుతోంది. ఈ వేదిక మీద రాత్రి
అనే స్త్రీ సరసంగా - సకల దిక్కుల అధిపతుల ముందర
నటించబోతోంది రంగస్థలం లోపల ఆరాత్రి అనబడే స్త్రీ
(నిశాసతి). వెలుపల సభలో దిక్పతులు. ఈ కార్యక్రమం
మొత్తానికి ఒక సూత్రధారి(దర్శకుడు) ఉంటాడు.
అతడు కాలము అనే గొప్ప సూత్రధారి. ఇతడు
ప్రయత్నపూర్వకంగా నట్టువరాలు ప్రేక్షకులకు
అప్పుడే కనబడకుండా సదరు నిశాసతికి అడ్డుగా
ఒక తెర ఎత్తిపట్టుకున్నాడు. ఆ తెరకొత్తదీ ఎర్రదీ
పెద్దదీ. అదే - సంధ్యాసమయంలో కనపించే
ఎర్రదనపు వెలుగుసుమా
ఈ విధంగా సంధ్యారాగం ఒప్పుతోందని.


No comments:

Post a Comment