Tuesday, March 20, 2018

ఇవి తెలుసుకుందాం


ఇవి తెలుసుకుందాం


సాహితీమిత్రులారా!



మనం ప్రతిరోజూ ఎక్కడోఒకచోట
షష్టిపూర్తి చేసుకొనేవారిని గమనిస్తుంటాం
అది ఎందుకు చేసుకోవాలి ఇలాంటివేమైనా
ఇంకా ఉన్నాయా అనే దాన్ని గురించి ఇక్కడ
తెలుసుకుందాం-
60 సం., 70సం., 81 సం.లకు మనిషికి గండం 
వుంటుందని వాటికి శాంతి చేసుకోవాలని 
మన శాస్త్రకారులు  చెబుతారు. 

షష్టిపూర్తి - 

ఇది 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో
చేసుకొనే వేడుకని అందరూ అను కుంటారు కాని
శాస్త్రకారులు 
"జన్మతః షష్టిమేవర్షె మృత్యు రుగ్ర రథోనృణాం" - అని 
చెబుతారు. అంటే పుట్టినది మొదలు 60వ సంవత్సరమున
ఉగ్రరధము అనే పేర మృత్యువు మానవుని వెన్నాడుతుంది.
ఈ 60వ సంవత్సరగండం దాటడానికై షష్టిపూర్తి శాంతి చేసుకో 
తగిందని దీనికే ఉగ్రరధ శాంతి అని పేరు.

70 సంవ్తరాల గండం-

"జన్మనాసప్తమేవర్షె మృత్యుర్భీ మరధోభవేత్" - అని 
శాస్త్రకారులు చెబుతారు. అంటే 
పుట్టింది మొదలు 70 వ సంవత్సరమునకు
భీమరధమని పేర మృత్యువు వెన్నాడుతూంటుంది. 
దీని శాంతి కొరకై భీమరధ శాంతిని చేసుకోవాలి.

81 సంవత్సరముల ఉత్సవం -

అశీత్యేకాబ్దమాసేస్యాత్ అధికమాసైస్సమన్వితే
సహస్ర సోమదర్శస్యాత్ ఊర్జ్యంస్యాత్ పుణ్యకృత్

ఎనబై ఒకటవ సంవత్సరమన శతాభిషేక మహోత్సవం 
చేయదగింది. పుట్టినది మొదలు అధికమాసంలతో కూడ 
లెక్కిస్తే 81వ సంవత్సరానికి 1000 సంద్రదర్శనాలవుతాయి
కావున శతాభిషేకోత్సవం చేసుకోదగింది.

1 comment:

  1. భీమరధ శాంఇ పూజాకల్ప పుస్తకం కావలెను.

    ReplyDelete