Friday, March 2, 2018

తమిళ సాహిత్యంలో అగస్త్యుడు


తమిళ సాహిత్యంలో అగస్త్యుడు




సాహితీమిత్రులారా!




అగస్త్యుని పేరు వినని హిందువు వుండడంటే
అతిశయోక్తి కదేమో. అయితే తమిళ సాహిత్యంలో
ఈ పేరుతో ఒకరికంటే ఎక్కువ కనిపిస్తారు.
వారిలో మొదటి సంగం కాలంలోని అగస్త్యుడు,
మధ్యసంగం కాలంలోని అగస్త్యుడు ముఖ్యులు.

      పాండ్యరాజుల పోషణలో తమిళ వాఙ్మయ
వికాసం మూడు సంగాల ద్వారా జరిగినట్లు తెలుస్తుంది.
వాటిలో తలైచ్ఛంగం(మొదటి సంగం) క్రీస్తుకుపూర్వమే
మధురలో ఆరంభం అయిందని భావిస్తున్నారు. దీనిలో
అగత్తియనార్(అగస్త్యుడు)తో పాటు 549 మంది కవులు
న్నారని, అందులో శివుడు, మురుగన్ కూడా సభ్యులనే 
గాథలు ప్రచారంలో ఉన్నాయి. అగస్త్యుని రచనగా ప్రసిద్ధి
పొందిన లక్షణగ్రంథం, అగత్తియంలో 12 వేల సూత్రాలు 
ఉండేవని ప్రతీతి. అయితే ఇప్పుడు కొన్నిమాత్రమే 
లభిస్తున్నాయి. 

        పరమశివుడు సంస్కృతంలో వ్యాకరణాన్ని పాణినికి,
తమిళ వ్యాకరణాన్ని అగస్త్యునికి ప్రసాదించాడనే ఐతిహ్యం ఉంది.
ఏదిఏమైనా, తమిళభాషకు వ్యాకరణాన్ని అందించింది నంగుకు
అగస్త్యుని తమిళ పితామహుడు అని తమిళులు ప్రస్తుతిస్తారు.
అంతేకాక తమిళాన్ని అగస్త్యం అని కూడ పేర్కొంటారు.
పాణిని అనుసరించి అస్త్యుడు వ్యాకరణం వ్రాశారని కొందరు 
అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే అతని లక్షణ గ్రంథంలో 
కర్మణ్యర్థం, సప్తవిభక్తులు, తద్బవరూపంలో సంస్కృత శబ్దాలు 
మొదలైనవి చోటు చేసుకున్నాయని పండితులు భావిస్తున్నారు.

        మధ్యసంగం కపాడపురంలో వెలసింది. అందులో 
59 మంది కవులు ఉఇండేవారని, వారిలో అగస్త్యుడు, 
తొల్కాప్పియనార్ మొదలైనవారు ప్రసిద్ధులని తెలుస్తున్నది.
అగస్త్యుని 12 మంది శిష్యులలో తొల్కాప్పియనార్ ఒకరు.
సంస్కృత లాక్షిణికుడు, కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుని
(1294- 1325) ఆస్థానకవి అయిన విద్యానాథుని(14వ శ.)
అసలు పేరు అగస్త్య పండితుడని కొందరు అభిప్రాపడుతున్నారు.
అయితే దీనికి సరైన ఆధారాలు లేవు. కాబట్టి వీరు ఇద్దరు ఒకరే 
అని భావించనవసరంలేదు - అనిమరి కొందరి అభిప్రాయం.

No comments:

Post a Comment