Friday, February 10, 2017

రంభయైన ఏకులె వడకున్


రంభయైన ఏకులె వడకున్




సాహితీమిత్రులారా!




శ్రీనాథుడు రాజాస్థానాల్లో తిరుగుతూ,
భోగవిలాసాలను అనుభవిస్తూ
రసిక జీవనం గడిపిన వాడు.
ఆయన ఒకసారి పలనాడు ప్రాంతం వెళ్ళాడు.
అక్కడి ప్రజల ఆహార, ఆచార వ్యవహారాలు మోటుగా
ఉండటాన్ని చూచి పరిహాసంగా చెప్పిన పద్యం ఇది -


రసికుఁడు పోవడు పలనా
డెసఁగంగా రంభయైన ఏకులె వడకున్
వసుధేశుఁడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్

పలనాటిలో రంభ అంతటి అందగత్తె కూడ
ఏకులు వడుకుతుంది.
అక్కడి దొరలు కూడ నాగలు పట్టి పొలం దున్నుతారు.
మన్మథునంతవారుకూడ జొన్నంన్నమే తింటారు. -
అని పద్య భావం.

కొన్ని సంవత్సరాల క్రింటి వరకు
పలనాటిలో వరి ధాన్యం పండేదికాదు.
జొన్నలు అక్కడి ప్రధానమైన ఆహారంగా
ఉండేది.


No comments:

Post a Comment