Wednesday, February 8, 2017

వారు వీరౌతుంటారు


వారు వీరౌతుంటారు




సాహితీమిత్రులారా!

మనకు సాహిత్యంలో ఒకరు చెప్పిన పద్యాన్ని
మరోకరు చెప్పినట్లుగా కొన్ని పద్యాలిన్నాయి
వాటిలో పోతన చెప్పినట్లున్న మంచెన పద్యం.
మనవారు అతికినట్లు కతలు అల్లడంలో ఘనులు.
కేయూరబాహు చరిత్ర(1-13)లోని ఈ పద్యం చూడండి-

బాలరసాలసాలపుష్ప నవపల్లవకోమల కావ్యకన్యకన్
గూళుల కిచ్చి యప్పడుపుగూడు భుజించుకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయలి లేనివాడు గౌ
ద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై

ఈ మంచెన పోతనకు సుమారు 200 ఏండ్లకు పూర్వంవాడు

దీనికి చాటుకవుల కథనం -
పోతన శ్రీనాథుడు బావబావమరుదులని ప్రతీతి.
శ్రీనాథుడు రాజాశ్రయం వల్ల భోగ జీవితం గడుపుతూండగా
పోతన వ్యవసాయం చేస్తూ కవిత్వం వ్రాసేవాడు. ఆ సందర్భంగా
శ్రీనాథుడు పోతనను గేలి చేశాడని దానికి సమాధానంగా ఈ పద్యం చెప్పాడని కధనం-

బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్
గూళులకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై

(కావ్య కన్యక మామిడి చెట్టులేతచిగురాకులవలె కోమలమైనది.
అటువంటి దాన్ని అధములైన రాజులకిచ్చి వారిచ్చిన డబ్బుతో
పొట్టపోసుకోవడం కంటే కవులు నాగలి పట్టి పొలం దున్నితే ఏమి
అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తే మాత్రమేమి
భార్యాపుత్రుల పోషించటానికి కూతురువంటి కావ్యాన్ని
అమ్ముకోవటం కంటె స్వతంత్ర జీవనమే మంచిదని భావం)


రెండు పద్యాలకు పాఠాంతరాలు
తప్ప పెద్దతేడా కనబడదు కదా

No comments:

Post a Comment