Thursday, April 19, 2018

పోతన పద్యాన్ని అనుకరించిన రాయలు


పోతన పద్యాన్ని అనుకరించిన రాయలు





సాహితీమిత్రులారా!


పోతన కూర్చిన గజేంద్రమోక్షంలోని పద్యం
కృష్ణదేవరాయలను ఎంతగా అకర్షించిందో
దాన్ని తన ఆముక్తమాల్యదలో అనుకరించారు
చూడండి-
మొదట పోతన గజేంద్రమోక్షంలోని పద్యం-

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకార ణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

నాకు వేరు దిక్కులేదని ఆ సర్వేశ్వరుని గజేంద్రుడు శరణువేడే
సందర్భంలో ఈ పద్యం పోతన కూర్చారు.
ఇది చాలకాలం వరకు ప్రార్థనగా కూడ మన తెలుగువారు
వాడుకున్నారు వాడుతున్నారు. ఇలాంటిది అనకరించడంలో
పెద్దవింతేమీ లేదని పెద్దలు అనవచ్చు అనకపోవచ్చు
కాని నావంటి సామాన్యునికి వింతని అనిపించింది
అందుకే మీముందుంచాను.
చూడండి ఆముక్తమాల్యదలోని పద్యం-

ఎవ్వని చూడ్కి చేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వని యందు, డిందు మరి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడనే
నెవ్విధినైన నిన్గదియనేని, యనన్విని బంధ మూడ్చినన్‌
                                                                                         (ఆముక్తమాల్యద - 6- 43)
ఇక్కడ మాలదాసరి కథలో మాలదాసరి బ్రహ్మరాక్షసునికి
తాను తిరిగిరాక పోయిన అని శపథం చేసే సందర్భంలో
కృష్ణదేవరాయలు వాడాడు ఈ పద్యాన్ని.

No comments:

Post a Comment