Friday, April 27, 2018

అవాల్మీకీయ కథ - 1


అవాల్మీకీయ కథ - 1


సాహితీమిత్రులారా!



భాస్కరరామాయణంలో వాల్మీకి వ్రాయని అనే 
కథలున్నాయి వాటిలో ఒక కథ. 
అరణ్యకాండ ప్రథమాశ్వాసంలో
జంబుకుమారుని లక్ష్మణుడు చంపినట్లు చెప్పబడింది.
ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఆ కథ 
సంక్షిప్తంగా -
రాముడు అగస్త్యుని దర్శించిన తరువాత ఆయన
సూచించిన మేరకు అరణ్యంలో నివసించే ప్రాంతం
ఎన్నుకొని అక్కడ పర్ణశాల నిర్మించుకొనుటకు
వెళ్లే దారిలో జటాయువును దర్శించిన తరువాత
వారు పర్ణశాలను నిర్మించుకొనిన తరువాత
లక్ష్మణుడు రాముని పనుపున సీతకు పండ్లు
తీసుకురావటానికి అడవిలోకి వెళతాడు.
అక్కడ విద్ద్యుజ్జిహ్వుని కుమారుడు జంబుకుమారుడు
ఘోరమైన తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు
ఒక చంద్రహాసాన్ని ఇచ్చాడు దానికి తృప్తి పడని
జంబకుమారుడు దాన్ని పట్టించుకోకుండా తపస్సు 
చేస్తున్నాడు. ఆ ప్రాంతం చేరిన లక్ష్మణునికి
ఆ కత్తి మాత్రం కనిపించింది దాన్ని తీసుకుని
లక్ష్మణుడు అటు ఇటు ఝళిపించాడు.
 పండ్లు కోసుకోటాని పనికి వస్తుందని
పండ్ల చెట్లను కొడుతుంటే మునులు
వారించి చెట్లను అలా చేయవద్దని
కావాలంటే ఈ వెదురు పొదను ఒక వేటున 
తెవేయమన్నారు. దానితో వెదురు పొదను
నరుకగా అందులో నుండి తపస్సు చేసుకుంటున్న
జంబుకుమారుని తల తెగిపడింది. నేను ఒక
బ్రాహ్మణుని చంపానే అనే బాధతో అన్నదగ్గరకు
పరుగున వెళ్ళాడు. అక్కడికి మునులు వచ్చి
రామునికి జరిగిన వృత్తాంతమంతా వివరించారు
అతడు బ్రాహ్మణకుమారుడు కాదని చెప్పి
ఒక రాక్షసుడు మరణించాడని చెప్పి
రామలక్ష్మణులను శాంతింపచేశారు.
ఇది సంక్షిప్తకథ.

No comments:

Post a Comment