Friday, March 10, 2017

ఆనాటి ప్రజల విశ్వాసం


ఆనాటి ప్రజల విశ్వాసం




సాహితీమిత్రులారా!



పూర్వం ముద్రణాలయాలులేని కాలంలో
తాళపత్ర గ్రంథాలకు ప్రతులు వ్రాయడం పరిపాటి.
ఒకడు చాల కష్టపడి ఆంధ్రమహాభాతం ప్రతిని
ఆరు మాసాలలో పూర్తి చేశాడట చివరలో
పాఠకులకు అప్పగింతలు పెట్టుచున్నాడు.
ఆ అప్పగింతల పద్యం చూడండి-

వ్రాలా తప్పులు సెబ్రలు
చాలంగల నేను శబ్దగతులెఱుగన్
గేలింబెట్టక తిట్టక
పోలంగా దిద్దరయ్య బుధజనులారా!

(వ్రాయటంలో చాల తప్పులు దొర్లినవి
నాకు వ్యాకరణ జ్ఞానంలేదు
పరిహసించక - తిట్టక - తప్పులు దిద్ద
కోరుచున్నాను)

మరొక పద్యం మరోకరు వ్రసినది-

వ్రాతతప్పువలన వాచకు లలుగక
తప్పుగల్గెనేని తగిన యెడల
వలయు నక్షరములు వర్ణించి నిలుపుడీ!
సుకవులైనవారు సురుచిరముగ!

(వ్రాతలో దొర్లిన తప్పులను చూచి
చదువుకొనువారు కోపగించవద్దు
నేను మరచిన ఒత్తులను అక్షరములను
కావలసినచోట నిలుపుడు.
వ్యాకరణము- ఛందస్సు తెలిసిన సుకవులారా
నా తప్పును సవరించుకొనుడు)

పూర్వం తాళపత్ర గ్రంథాలకు ప్రతులు వ్రాయడం
రామకోటి వ్రాసినట్లుగా మహాపుణ్యమని భావించి
కొందరు వ్రాసేవారు
ఇది నాటి ప్రజల విశ్వాసం.

No comments:

Post a Comment