Saturday, March 4, 2017

దరిద్రులుగా ఎందుకు పుడతారో తెలుసా?


దరిద్రులుగా ఎందుకు పుడతారో తెలుసా?




సాహితీమిత్రులారా!



దరిద్రంతో బాధపడేవారంతా
ఎందుకు అలా పుట్టామా అని
ఆలోచిస్తుంటారు దానికి కారణం
చెబుతోందీ శ్లోకం చూడండి-

అదాన దోషేణ భవే ద్దరిద్రో
దారిద్య్ర దోషేన కరోతి పాపమ్
పాపా దవశ్యం నరకం ప్రయాతి
పునర్దరిద్రః పునరేవ పాపీ

గత జన్మలో ఏదీ ఎవరికీ దానం
చేయకపోవడం వల్ల దారిద్య్రం
సంభవిస్తుందీ జన్మలో. దీనివల్ల
ఈ జన్మలో కూడజా ఎన్నెన్నో
పాపపు పనులు చేయవలసి వస్తుంది.
ఈ పాపకృత్యాల వల్లనే నరక ప్రాప్తి.
నరక బాధల అనంతరం, తిరిగి
దరిద్రులుగా పుట్టవలసి వస్తుంది.
కనుక- ఎవరైనా తమకు ఎంత కలిగితే
అంతే దానం చేయాలి - అని భావం.

No comments:

Post a Comment