Sunday, December 24, 2017

ఆరుద్రగారి మధ్యాక్కరలు


ఆరుద్రగారి మధ్యాక్కరలు




సాహితీమిత్రులారా!



విశ్వనాథవారి మధ్యాక్కరలు చూసి ఉంటారు
అలాగే అబ్బూరి రామకృష్ణారావుగారు వ్రాశారు
వీరి శిల్పాన్ని మెచ్చుకొని ఆరుద్రగారు కూడ
మధ్యాక్కరలను వ్రాశారు. అవి
శుద్ధమధ్యాక్కరలు అనే పేర 60 దాకా
ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చైనాయి.
వాటిలోని ఒక మూడు మధ్యాక్కరలు ఇక్కడ-

ఆదిలో నన్నయ్యగారు
         అక్కరల్ విరచించినారు
పాదాంత విశ్రాంతు లిడక
         పాడేటి లయబోధ పడక
ఈ దేశి ఛందస్సులోని
         ఇంపైన గతి కొచ్చెహాని
ప్రాదుర్భవించింది నవత
         పాడుకో ఆరుద్ర కవిత


ఆరంభ పుణ్యకాలమున
         ఆధునిక ఖండ కావ్యమున
పేరుమాత్రం చెప్పకుండ
        " పృధ్వీప్రశంస"లో నిండ
తీరుగా రెండు పాదాలు
         తియ్య తేనియలున్న పూలు
ఆరూఢిగా గ్రుచ్చినారు
         అక్కరల్ అబ్బూరి వారు

కామ్యమౌ నూతనత్వమ్ము
         కండగల అంత్యప్రాసమ్ము
రమ్యమ్ముగా తెచ్చినారు 
         రామకృష్ణరావుగారు
సౌమ్యమౌ అక్కరల్ నేడు
         "సామ్రాట్టు" చేపట్టినాడు
గమ్యమ్ము గమనమ్ము సౌరు 
         కటకటా కనిపించనీదు

No comments:

Post a Comment