Monday, December 11, 2017

ఈ శ్లోకం చూడండి


ఈ శ్లోకం చూడండి




సాహితీమిత్రులారా!



లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతంలోని
ఈ శ్లోకం చూడండి
కేవలం పేర్లనే శ్లోకం మలచి చివర్లో
మాత్రమే తన విన్నపాన్ని తెలిపాడు

హేగోపాలక! హేకృపాజలనిధే! హేసిన్ధుకన్యాపతే!
హేకంసాంతక! హేగజేన్ద్రకరుణాపారీణ! హేమాధవ!
హేరామానుజ! హేజగత్త్రయగురో! హేపుండరీకాక్ష! మాం
హేగోపీజననాథ! పాలయ పరం జానామి న త్వాం వినా

హేగోపాలక! 
హేకృపాజలనిధే! 
హేసిన్ధుకన్యాపతే!
హేకంసాంతక! 
హేగజేన్ద్రకరుణాపారీణ! 
హేమాధవ!
హేరామానుజ! 
హేజగత్త్రయగురో! 
హేపుండరీకాక్ష! 
హేగోపీజననాథ!
ఇవన్నీ పేర్లేకదా ఇందులో
మాం - నన్ను,
పాలయ - కాపాడుము,
త్వాంవినా - నిన్నువిడిచి
పరం - వేరోకరిని
నజానామి - ఎరుగను
అనేవే ఆయన ప్రార్థన

ఓ గోపాలా, ఓదయామయా, ఓలక్ష్మీనాథా, ఓకంసధ్వంసీ,
ఓగజరాజవరదా, ఓమాధవా, ఓకృష్ణా, ఓముల్లోకములతండ్రీ,
ఓతామరకన్నులవాడా, ఓగోపాంగనావల్లభా, ననుగావుము,
నీకంటే అన్యులను ఎరుగను- అని భావం.

ఇందులో భగవంతుని పేర్లుతప్ప
వేరులేదు అంటే
భగవన్నామస్మరణే
ఈ శ్లోకం చదివిన వారికి 
భగవత్కృపలభిస్తుందనే
భావించాలి.

No comments:

Post a Comment