Friday, December 15, 2017

శ్లోకానువాదం ఎలా వుండాలి?


శ్లోకానువాదం ఎలా వుండాలి?




సాహితీమిత్రులారా!

సంస్కృత శ్లోకాలను అనువదించేప్పుడు
శ్రీనాథుడు పెట్టుకొన్న నియమాలను
అనుసరిస్తేనే మూలం చదువుతున్నంత
తృప్తి దొరుకుతుందట-
ఆ నియమాలు
1. శబ్దాన్ననురించి ఉండటం  
2. అభిప్రాయాన్ననుసరించి ఉండటం
3. భావాన్ని ఉపలక్షించటం
4. రసాన్ని పోషించటం
5. అలంకారాలను భూషించటం
6. ఔచిత్యాన్ని ఆచరించటం
7. అనౌచిత్యాన్ని తీసివేయటం
చేసినప్పుడే "మాతృకను అనుసరిచి చెప్పబడిన 
కావ్యంమే హృదయంగమం"గా ఉంటుందట.
ఇక్కడ ఒక శ్లోకాన్ని విద్వాన్ విశ్వంగారు
రెండు కందాల్లో అనువదించిన తీరు గమనిద్దాం-

మందాక్రాంత వృత్తం -
ధూమజ్యోతి స్సలిల మరుతాం సన్నిపాతః క్వమేఘః
సందేశార్ధాః క్వపటు కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరి గణయన్ గుహ్యకస్తం యయాచే
కామార్తాహి ప్రకృతి కృపణా శ్చేతనా చేతనుషం

దీనికి విశ్వంగారి తెనిగింపు(ఆంధ్రీకరణం)-

ధూమజ్యోతి స్సలిల మ
హా మారుత సన్నిపాతమగు మబ్బేడా?
ధీమంతులు గొంపోయెడు
క్షేమ సమాచారమేడ? చిత్రము కదా?

అయినన్ తన తమి పెనగొని
వయికొన్నన్, యక్షుడబ్దపతి యాచించెన్
దయితాదూరుల మతి, కెం
తయినా చేతనవిచేతనము లొకటిగదా?

No comments:

Post a Comment