Sunday, December 17, 2017

దేవుని గురించిన పద్యం


దేవుని గురించిన పద్యం




సాహితీమిత్రులారా!



గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు
చెప్పిన పద్యం ఇది
ఇందులో ఆయనకు
దేవుని పైగల అభిప్రాయం
వ్యక్తమౌతుంది గమనించండి-

పువ్వులగొనితెచ్చి పూజింపనేలకో
         విరులగుంపున నిన్ను నరయువాడు
పుణ్యవాహినులలో బోయి క్రుంకగనేల
         హృదయగీతముల నిన్ను వెదకువాడు
వర్ణాశ్రమములంచు పరితపింపగనేల
         బుధులందు నినుజూచి పొంగువాడు
కల్ల విగ్రహముల కరుణ వేడుటయేల
         ఘనకార్యముల నిన్ను గనెడువాడు
సృష్టి యెల్లను నీవయై చెలగుచుంట
గాంచి యుప్పొంగి కార్యంబు కడక దీర్చి 
తనదు మనమున నినుగొల్చి కొనెడుగాని 
మాయలో బడి సత్యంబు మరచునొక్కొ

పువ్వులను కొని తెచ్చి పూజించడ మెందుకు
పూలమధ్యలోనె నిన్ను చూచేవాడు
పుణ్యనదుల్లో మునుగడమెందుకు
తనహృదంలో గీతాల్లో నిన్ను వెదకువాడు
బ్రహ్మచర్యం, గృస్థాశ్రమం, వానప్రస్థం,
సన్యాశాస్త్రమం అని ఆశ్రమాలగురించి
పరితపించందేనికి బుధులలో నిన్ను చూచేవాడు
అబద్ధపు విగ్రహాలలో నిన్ను వెదకడమెందుకు
గొప్పకార్యాల్లో  నిన్ను చూస్తున్నవాడు
సమస్త విశ్వంలో నీవేయై చెలగుటను చూచి
ఉప్పొంగి నిన్ను మనసులో నిలుపుకొంటాడేగాని
మాయలోపడి సత్యాన్ని మరచిపోతాడా అని భావం.

అంటే పూజల్లోనూ, నదీస్నానాల్లోనూ, వర్ణాశ్రమాల్లోనూ
విగ్రహాల్లోనూ దేవుడిని చూడకుండా పూవుల్లోనూ
హృదయంలోనూ, మంచివాళ్ళలోనూ, గొప్పపనుల్లోనూ
చివరకు సృష్టి అంతటా కనిపించే దేవుడిని అసత్యమైన
వాటిలో కాకుండా సత్యమైన తనహృదంలో నిలుపుకొంటాడట.

No comments:

Post a Comment