Friday, April 28, 2017

ఏదీ నాటి తృప్తి?


ఏదీ నాటి తృప్తి?




సాహితీమిత్రులారా!



తిరుపతి వేంకట కవులలోని
చెళ్లపిళ్ళ వేంకట శాస్తిగారు
కామేశ్వరీయము అనేశతం వ్రాశారు
అందులోని ఈ పద్యం చూడండి-

చదువుల్ విస్తరికుట్లు, జందెపు బనుల్ చాపల్, మఱిన్ దొడ్డి లో
పొదలున్ కూరలు గాగ వర్తిలిరి మున్ భూమీసురుల్ - నేటి సం
పద మోటారులు, మేడలోడలునుగా మాఱెంగదా వీరి కు
న్నదె అవ్వారల తృప్తి వారి సుఖ మానందంబు కామేశ్వరీ!


పూర్వం విద్యావంతులైన పండితులైన వారు విద్యార్థులకు
విద్యాదానం చేస్తూ వేదశాస్త్రాలు పాఠాలు చెబుతూ
విస్తర్లుకుట్టుకుంటూనో, జందేలువడుక్కుంటూనో,
దర్భలతో చాపలు అల్లుతూనో గడిపేవారు.
దొడ్డిలో పూలచెట్లు, కూరగాయల పనులు
చూసుకుంటూ అదే వారి సంపదగా భావించేవారు.
నేటివారికి సంపదకు కొలమానాలు వారి మోటారుకారులు,
మేడలు, ఓడలు అయినాయి. ప్రాచీనుల తృప్తి,
ఆనందం ఇప్పటివారికి ఉన్నాయా-
అని కామేశ్వరీదేవిని అడుగుతున్నారు.

ఆలోచించండి వారు దేవిని అడిగినది నిజమేనా?
కాదా?

No comments:

Post a Comment