Sunday, April 17, 2016

పెద్దనగారి - సంధ్యారాగం


పెద్దనగారి -  సంధ్యారాగం

సాహితీమిత్రులారా!

"నాకంటే మనుష్య స్త్రీలే ఎక్కువ అదృష్టవంతులు. వారు తాము ప్రేమించిన పురుషుడు 
నిరాకరిస్తే చనిపోతారు. నేను మరణించలేను" -  అని దు: ఖిస్తూ ఉంది వరూధిని.
ఇంతలో ప్రొద్దుక్రుంకినది.
సంధ్యాకాంతులు కమ్మినవి.
ప్రపంచమంతా ఎర్రబారినది.
ఈ సందర్భంలో పెద్దనగారి సంధ్యారాగం ఈ పద్యంలో చూడండి.

ఉరుదరీకుహరసుస్తోమ శార్దూలముల్ ఝరవారి శోణితశంకఁద్రావ

వనకుంజమధ్యశాద్వలచరన్మృగపంక్తి దావపావకరీతిఁ దల్లడిల్లి

నాశ్రమాంతరభూరుహాగ్రముల్ మునికోటి బద్ధకాషాయవిభ్రాంతిఁ జూడ

ఘనసానుశృంగశృంగాటకంబులఁ గాంచి యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ

గాసెఁ బేశలరుచిఁ గింశుకప్రవాళ

ఘుసృణకిసలయకంకేళికుసుమగుచ్ఛ

బంధుజీవజపారాగబాంధవంబు

లన్నగంబున జరఠారుణాతపములు

                 (మనుచరిత్ర - 3-11)

ఈ పద్యానికి విశ్వనాథవారి భావం చూడండి.
పెద్దగుహా గర్భములందు సుప్త - నిదురపోయి, ఉత్థ - లేచిన, శార్దూలముల్ -
పెద్దపులులు, ఝరవారిన్ - సెలయేళ్ళలోని నీటిని, శోణితశంకన్ - నెత్తురన్న ఊహతో,
త్రావన్ - త్రాగగా, పెద్దపులులు పగలెల్ల నిద్రపోయి ఆ మగత సరిగా తీరకముందు
సంధ్యాకాలపు ఎర్రదనంచేత ఎర్రబడిన సెలయేటి నీళ్ళు నెత్తురనుకొని త్రాగినవట.
అడవిలో అగ్ని బయలుదేరిందని లేళ్ళగుంపు భయపడినది.
మునులు చెట్లకొమ్మలమీది ఎర్రదనము చూచి ప్రొద్దున ఎండవేసిన
తమకావిబట్టలి శిష్యులు విప్పలేదని అనుకొనిరి. వట్టి కొండచెరియలు
చూచి దేవతలు వారి నివాసభూమియైన  బంగారు పర్వతవనుకొని
పడమటి కొండమీద వాలిరి.
మన పూర్వులు సంధ్యారాగాన్ని ఎంత అందంగా వర్ణించారో దీన్నిబట్టి తెలుస్తుంది కదా!

No comments:

Post a Comment