Friday, August 14, 2026


 పార్వతీదేవి ప్రక్కకు తిరిగి ఎందుకు నవ్వింది?

సాహితీమిత్రులారా!


అక్బర్ బాద్షా - కవి గంగ్ ల  వినోదం గురించి తెలుసుికుందాం - 

ఒక సాయంత్రం అక్బర్ బాద్షా మరియు కవిరాజ్ గంగ్ విహరిస్తూ నదీ తీరాన ఉన్న ఒక శివాలయానికి చేరుకున్నారు. అక్కడ శివాలయంలోని పార్వతీదేవి విగ్రహాన్ని బాద్షా నిశితంగా పరిశీలించాడు. ఆ విగ్రహం శివుని వైపు కాస్త ముఖం పక్కకు తిప్పి, నవ్వుతున్నట్లుగా చెక్కబడి ఉంది (అది శిల్పి యొక్క నైపుణ్య.

 అప్పుడు బాద్షా కవిరాజ్‌ను చూసి "కవీ! పార్వతీదేవి శివుడి వైపు ముఖం వంకరగా తిప్పి ఎందుకు నవ్వుతోంది?" అని అడిగాడు. దానికి కవి గంగ్ సమయస్ఫూర్తితో ఈ కింది పద్యంతో సమాధానమిచ్చాడు.

"విభూతి చఢావత్ శంకర్ పే, అహిలోచన్ మంద్ పడీ ఝరకే |

వాకా సుసవాట్ ఉడ్యా శీర్ పే, జన్మ అమృత్ ఖుర్ద్ పడీ ఖసీ ||

నహి హతా భృగరాజ్ త్వచా, యా యోగీరాజ్ రహ్యో అటకే |

సురభీ సుత్ మోహన్ భాగ్ చఢ్యా 'జబ్ గౌరీ హసీ ముఖ్ యూం కర్ కే' ||"

 పద్య వివరణ:

1.       ఒకసారి పరమశివుడు తన శరీరానికి విభూతి (భస్మం) అలముకుంటున్నప్పుడు, అందులోని కొంత భస్మపు ధూళి ఆయన మెడలో ఉన్న నాగుపాము (సర్పం) కంట్లో పడింది.

2.   దానితో ఆ నాగుపాము కోపంతో గట్టిగా బుస కొట్టింది. ఆ బుసలోంచి వెలువడిన విషపు జ్వాల శివుని నుదుటిపై ఉన్న చంద్రుడికి తగిలింది.

3.    చంద్రుడికి విషపు సెగ తగలడంతో, ఆయన నుండి ఒక అమృత బిందువు జారి శివుడి ఆసనమైన పులితోలు (వ్యాఘ్రచర్యం) మీద పడింది.

4.    అమృత బిందువు తగలగానే ఆ పులి సజీవమై గర్జించింది!

5.    పులి గర్జన వినగానే శివుడి వాహనమైన ఎద్దు (ఆంబోతు/సురభి సుత్) భయంతో పరుగు అందుకుంది.

6.    శివుడి చుట్టూ జరిగిన ఈ విచిత్ర సంఘటనల వరుసను (పాము బుస కొట్టడం, పులి బ్రతకడం, ఎద్దు పారిపోవడం) చూసి పార్వతీదేవి తల పక్కకు తిప్పి నవ్వింది!

 ఈ చమత్కార వివరణ వినగానే అక్బర్ బాద్షా ఎంతో సంతోషించాడు.

No comments:

Post a Comment