Saturday, August 22, 2026

గురువు - శిష్యుడి కథ

 

గురువు - శిష్యుడి కథ


"శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తం కలేవరమ్ |

ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః ||"

1. గురువు చెప్పిన అసలు అర్థం:

ఒక సాధువు (మహాత్ముడు) మరణ శయ్యపై ఉన్నప్పుడు, ఆయన శిష్యుడు "మహారాజ్! మీకు ఏమైనా మందులు తీసుకురానా?" అని అడిగాడు.

దానికి గురువుగారు పై శ్లోకాన్ని చెబుతూ ఇలా సమాధానమిచ్చారు:

"శరీరం పూర్తిగా క్షీణించి, రోగగ్రస్తమైనప్పుడు... గంగాజలమే సరైన ఔషధం (చివరి తీర్థం), ఆ శ్రీమన్నారాయణుడే వైద్యుడు."

అంటే, శరీరం అంతిమ ఘడియలకు చేరుకున్నప్పుడు మందుల కంటే భగవంతుడి ధ్యానం, గంగాజలమే శరణ్యమని గురువు ఉద్దేశం. కొద్దిసేపటికి ఆ గురువుగారు పరమపదించారు.

2. శిష్యుడి విపరీత అర్థం (విపరీత వ్యాఖ్యానం):

కొన్నాళ్లకు ఆ శిష్యుడు కూడా జబ్బుపడ్డాడు. అతడు ఏమాత్రం సంకోచించకుండా వరుసగా మందులు వాడటం మొదలుపెట్టాడు.

అది చూసి ఒకరు మహారాజా మందులు తింటే ధర్మభ్రష్టత్వం కలుగుతుంది కదా! మీరు మందులు ఎందుకు తాగుతున్నారు?” అని అడిగారు.

దానికి ఆ శిష్యుడు తన గురువు చెప్పిన శ్లోకాన్నే ఉదాహరిస్తూ విచిత్రమైన వివరణ ఇచ్చాడు:

 “నాగురువుగారు ఏం చెప్పారంటే శరీరం బలహీనపడి నప్పుడు మనం త్రాగే ఔషధాన్ని (మందును)  గంగాజలమంత పవిత్రమైనదిగా భావించాలి ఒక్కచుక్కకూడా వృథా కాకుండా తాగాలి. చిక్త్స చేసే వైద్యుని సాక్షాత్తుగా నారాయణునిగా భావించాలి..

 సందేశం / హాస్యం

ఒకే శ్లోకాన్ని స్వార్థానికి లేదా సౌకర్యానికి తగినట్లుగా ఎలా వంకరగా చేసుకుంటారో ఈ వ్యాఖ్యానాన్ని చూస్తే తెలుస్తుంది. . ఈ కథ సరదాగా వివరిస్తోంది.

No comments:

Post a Comment