Sunday, August 16, 2026


బ్రాహ్మణులకు దారిద్య్రం ఎందుకు ?

సాహితీమిత్రులారా!

ఒకసారి బ్రాహ్మణులందరూ నిరంతరం భిక్షాటన చేసే వృత్తితో విసిగిపోయి, అందరూ కలిసి లక్ష్మీదేవిని ఆరాధించి తమ దారిద్య్రం గురించి ప్రశ్నించారు.

బ్రాహ్మణుల దోహా -

"రే! లక్ష్మీ అఖిలేశ్వరీ, తూం సృష్టి ఆధార్ |

అమ్ పర్ తే రూఠీ క్యాం, విఘ్న భిక్షా ధార్ ||"

·         భావం: ఓ లక్ష్మీదేవి! నువ్వు అఖిలలోకేశ్వరివి, సమస్త సృష్టికి ఆధారానివి. అలాంటి నువ్వు మా బ్రాహ్మణులపై ఎందుకు కోపగించుకున్నావు? మమ్మల్ని ఎందుకు భిక్షాటన చేసే దారిద్య్రంలో నెట్టావు?

దానికి లక్ష్మీదేవి మనహర్ ఛందస్సులో ఈ కింది విధంగా సమాధానమిచ్చింది.

లక్ష్మీదేవి సమాధానం - మనహర్ కవిత:

"కుంభజే తో కీధు పాన్, మమ్ తాత సాగర్ నుం,

ఏథీ తో ఉద్వేగ్ అతి, అంతర్ మామ్ థాయ్ ఛే |

భూదేవ్ భృగు ఏ భారే, కరీ క్రోధ్ అంతర్ మామ్,

మారీ లాత్ మమ్ పతి, త్రిభువన్ రాయ్ నే ||

వైరీ విద్యా ముఖ్ ధారే, పూజా మాటే పద్మ్ గృహ్,

భూదేవా తో భావ్ కరీ, నిత్య తోడీ జాయ్ ఛే |

కహే కలాల్ కర్, ఏవామ్ ఛే అంగత్ వేర్,

 తేథీ విప్రకుళ్ కుశ, త్యాగ్ తో కరాయ్ ఛే ||"

లక్ష్మదేవి బ్రాహ్మణులపై కోపానికి  నాలుగు కారణాలు 

లక్ష్మీదేవి బ్రాహ్మణులతో "నాకు, మీ విప్రకులంతో వ్యక్తిగత వైరం (అంగత్ వేర్) ఉంది, అందుకే మిమ్మల్ని విడిచిపెట్టాను" అని చెబుతూ నాలుగు కారణాలు చెప్పింది:

1.       తండ్రిని తాగడం: బ్రాహ్మణుడైన కుంభజుడు (అగస్త్య మహర్షి) నా తండ్రి అయిన సముద్రాన్ని (సాగరుడిని) ఒక్క గుటకలో తాగేశాడు. అది నా మనస్సులో ఆవేదనగా ఉంది.

2.       భర్తను తన్నడం: బ్రాహ్మణుడైన భృగు మహర్షి కోపంతో నా భర్త, త్రిభువనాధిపతి అయిన శ్రీమహావిష్ణువు రొమ్ముపై కాలితో తన్నాడు.

3.       శత్రువును పూజించడం: నా శత్రువైన 'విద్యల దేవి' సరస్వతిని మీరందరూ నోటిలో (ముఖంలో) ధరించి నిరంతరం ఉపాసిస్తారు.

4.       ఇంటిని నాశనం చేయడం: నా నివాస స్థానమైన తామరపూలను (పద్మ గృహాలను) బ్రాహ్మణులైన మీరు మీ పూజల కోసం ప్రతిరోజూ తుంచివేస్తారు.

ఈ విధంగా నా తండ్రిని తాగి, నా భర్తను తన్ని, నా శత్రువును పూజిస్తూ, నా నివాసాన్ని రోజూ తుంచే మీ విప్రకులానికి నేను ఎలా అనుగ్రహం ఇస్తాను? అందుకే మిమ్మల్ని విడిచిపెట్టాను అని లక్ష్మీదేవి సమాధానమిచ్చింది.

No comments:

Post a Comment