Wednesday, May 16, 2018

పుగళేంది


పుగళేంది




సాహితీమిత్రులారా!



పుగళేంది 13వ శతాబ్దికి చెందిన తమిళకవి.
ఈయన ఎం.జి.ఆర్. చెంగల్ పట్టు జిల్లాకు
చెందిన పొన్ విళైందకలత్తూర్ అనే గ్రామంలో
జన్మించాడు. ఇది చెన్నైకి దగ్గర్లో ఉంది.
ఈయన మహాభారతంలోని నలచరిత్రను
"నళవెణ్బా" కావ్యంగా వ్రాశారు. వెణ్బ అంటే 
ద్విపద. ఈ కావ్యంలో 424 ద్విపద పద్యాలున్నాయి.
నలమహారాజు కలిప్రభావంతో భార్యను విడిపోయి
నానాబాధలు పడి చివరికి కలుసుకోవడం ఇందులోని 
ఇతివృత్తం. మన భారతదేశంలో నలమహారాజు చరిత్ర
అన్ని భాషల్లోనూ వ్రాయబడింది. ఇది అంతప్రధానమైన
కథగా భారతంలో చెప్పబడింది. పుగళేందిని మాళవ దేశ
"చంద్రస్వర్గి" అనే రాజు ఆదరిస్తాడు. అందుకే ఈ రాజును 
నళవెణ్బా కావ్యంలో ఐదుచోట్ల ప్రస్తావించాడు.  అలాగే
పుగళేంది శ్రీలంకకు వెళ్లి అచటి పాండ్య దళపతి "ఆర్యశేఖర్"
అనే సేనాధిపతి నుంచి బహుమానాన్ని స్వీకరించాడు.
పుగళేంది "చెంజికలంబగం" అనే మరో గ్రంథాన్ని రచించాడు. 
కాని ఇది నేడు అలభ్యం. ఈ రెండు గ్రంథాలేగాక
"అల్లి అరపాణి మాలై పవళకొడిమాలై", "పులేంద్రవ్", 
"కలవుమాలై", "ఏణిఏర్ట్రం", "పంచపాండవర్ వనవాసం",
"రత్నసురుక్కం" మొదలైన వాటిని రచించినట్లు చెబుతారు.
వెణ్బాఛందస్సులో అనన్యప్రతిభ పాటవాలు చూపించినవాడు
పుగళేంది. వెణ్బా ఛందస్సు ఇతనికి ముందు పురాణ కావ్యాల్లో
తక్కువగా వాడటం జరిగింది. తరువాత చాలమంది పుగళేందిని
ఆదర్శంగా తీసుకొని ప్రయోగించారని తెలుస్తుంది.

No comments:

Post a Comment