Thursday, May 3, 2018

ఈ పద్యాలను ఒకసారి చదవండి - 1


ఈ పద్యాలను ఒకసారి చదవండి - 1



సాహితీమిత్రులారా!



మనుచరిత్రలోని ఈ పద్యాలను చదవండి
వీలైతే మీ పిల్లలకు నేర్పండి
అర్థంతో పనిలేదు నోరు తిరగటానికి
అభ్యాసం  చేయించండి

ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళినపుడు
హిమాలయ వర్ణన చేసిన పద్యం-

అటఁజని కాంచె భూమిసురుఁడంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటలముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్స్వన
స్పుటనటనానుకూలపరిపుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్
                                                           (మనుచరిత్ర - 2 - 3)

ఇందీవరాక్షుడు గురువును మోసగించి విద్యను నేర్చుకొన్న
తరువాత గురువుతో గర్వంతో నేర్చుకున్న సంగతి చెప్పడంతో
కోపంతో గురువు ఎలావున్నాడో చెప్పే పద్యం-

అనినం గన్నులు జేవురింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్యద్భ్రుకుటీభజంగయుగళీపూత్కారఘోరానిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్
చినుకం గంతుదిదృక్షరూక్షనయనక్ష్వేళాకరాళధ్వనిన్
                                                                 (మనుచరిత్ర - 5 - 18)

మరోమారు మరో కావ్యంలోని పద్యాలను చూద్దాం

No comments:

Post a Comment