Thursday, June 8, 2017

ఇది సరైందేనా?


ఇది సరైందేనా?




సాహితీమిత్రులారా!




మనసు చాల చిత్రమైంది. దానికి బాధకలిగినా
సంతోషం కలిగినా ఇతరులతో చెప్పుకోవానిపిస్తుంది.
మరి కామార్తులైతే దేనితో చెప్పవచ్చునో కూడదో
అనేదాన్ని కూడ చూడరు. నలుడైతే హంసతో రాయబారం
నడిపాడు, దీని ప్రాణముంది. కానీ ప్రాణంలేని
మేఘంతో సందేశం పంపాడు కాళిదాసు మేఘసందేశంలో
యక్షుడు. మేఘసందేశంలోని ఈ  శ్లోకం చూడండి-

ధూమజ్యోతిః సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరిగణయన్గుహ్యక స్తం యయాచే
కామార్తా హి ప్రకృతి కృపాణాశ్చేతనా చేతనేషు

పొగ, నిప్పు, నీరు, గాలి - అనే వాటి కలయికతో
ఏర్పడిన మేఘమెక్కడ సమర్థములయిన ఇంద్రియములు
గల ప్రాణులచేత ప్రాణీయములైన సందేశార్థములెక్కడ
అని ఆలోచింపక ఔచిత్యం వల్ల యక్షుడు దానిని(మేఘాన్ని)
యాచించాడు. కామార్తులు చేతనాచేతనముల విషయమున
స్వాభావికముగానే దీనులుకదా - అని భావం
ప్రాణంలేని మేఘం ప్రాణసంబంధమైన ప్రేమ
ను గురించి ఎలావివరింపగలదు - ఇది సరైనదేనా
అని ప్రశ్న. దానికి శ్లోకంలోనే సమాధానం దొరికింది.
కామార్తులకు ప్రాణమున్నదా లేదా అనే దానితో పనిలేదట.

No comments:

Post a Comment