Saturday, June 10, 2017

మూడక్షరాలే మూర్చకలిగించాయే


మూడక్షరాలే మూర్చకలిగించాయే




సాహితీమిత్రులారా!


భాసుని నాటకాలలో అభిషేకనాటకం ఒకటి
దీనిలోని ఒక ఘట్టంలోని ఒక అంశం చూద్దాం-

హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ లంకలో
అంతా తిరిగాడు అశోకవనంలో ప్రవేశించాడు
అక్కడ రావణుడు సీతను  చూస్తూ రాముని
నిందాపూర్వకంగా మాట్లాడుతూ సీతపై
అనురాగపూర్వకంగా మాట్లాడాడు
ఆసందర్భంలో సీత నోటినుండి మహాప్రభావంతో
వెలువడిన మూడక్షరాలు - శప్తో2సి( ఛీ నింద్యుడా)
అనే మాటవినగానే రావణుని హృదయం
భయాక్రాంతమైపోతుంది అప్పుడు
అతడు ఇలా అనుకుంటాడు-

హ హ హ అహో పతివ్రతాయా స్తేజః
దేవాః సేన్ద్రయో భగ్నా దానవాశ్చ మయా రణే
సోహం మోహం గతోస్మృద్య సీతాయాస్త్రిభిరక్షరైః
                                                                         (అభిషేకనాటకం - 2.18)

ఆహా ఈ పతివ్రత తకేజస్సు ఏమి తేజస్సు
నేను రణరంగంలో ఇంద్రాది దేవతలను
దానవులను కూడ ఓడించాను అలాంటి నాక్కూడా
సీత ఉచ్ఛరించిన ఈ మూడు అక్షరాలు వినగానే
మూర్ఛవచ్చినట్లవుతూన్నది- అని భావం

సీతాదేవిలో ఉన్న ప్రభావవంతమైన ఆత్మశక్తిని
చిత్రించే ఈ చిన్న శ్లోకం భాసునికి కూడ నచ్చి
ఉంటుంది. సామాజిక ప్రజలకు కూడ.


No comments:

Post a Comment