బుచ్చిబాబు రచన-
నన్ను గురించి కథ వ్రాయవూ!
సాహితీమిత్రులారా!
బుచ్చిబాబుగారి కథ -
నన్ను గురించి కథ వ్రాయవూ!
కథనం, పరిచయం, విశ్లేషణ - కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బుచ్చిబాబుగారి కథ -
నన్ను గురించి కథ వ్రాయవూ!
కథనం, పరిచయం, విశ్లేషణ - కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
భాగవతంలో భగవంతుని స్వరూపం ఎక్కడ ఏవిధంగా ఉందో
కౌశికసంహితలో ఈ విధంగా వివరించారు-
మొదటి స్కంధంలో శ్రీకృష్ణుని పాదాలనుండి మోకాళ్ళవరకు
ద్వితీయ స్కంధంలో కటి (మొల) పర్యంతం
తృతీయస్కంధంలో నాభి(బొడ్డు)
చతుర్థస్కంధంలో ఉదరభాగం
పంచమస్కంధంలో హృదయం
షష్ఠమస్కంధంలో కంఠం
సప్తమస్కంధంలో ముఖం
అష్టమస్కంధంలో కన్నులు
నవమస్కంధంలో బుగ్గలు కనుబొమలు
దశమస్కంధంలో బ్రహ్మరంధ్రము
ఏకాదశస్కంధంలో మనస్సు
ద్వాదశస్కంధంలో ఆత్మ
ఉన్నాయని వివరించింది
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి
తెలుగు ఆడియో బుక్
నుండి మనిషికి మనిషికి మధ్య(కథ)
ఆనే కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బ్రహ్మ తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? ?
ఈ విషయమై నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
నమస్కారం గొప్పదనాన్ని తెలియచేస్తూ
కువలయానందం అనే అలంకారశాస్త్రంలో
అప్పయ్య దీక్షితులవారు
ఈ పద్యం చెప్పారు గమనించగలరు-
వపుః ప్రాదుర్భావతః అనుమితమిదం జన్మని పురా
పురారే న క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్
నమన్ముక్తః సంప్రత్యహమతనుః అగ్రేప్యనతిమామ్
ఇతీశ క్షంతవ్యం తదిదం అపరాధ ద్వయమపి
ఓ పరమేశ్వరా! రెండు తప్పులను చేశాను క్షమించు.
గత జన్మలో నేను నమస్కరించకపోవడం వల్ల ఇప్పుడు
జన్మనెత్తాను. ఈ జన్మలో నేను నీకు నమస్కరిస్తే ఇక జన్మ
ఉండదు కనుక అపుడు నీకు నమస్కరించే అవకాశం
లేదు కదా కనుక నా తప్పులను క్షమించు - అని భావం
సాహితీమిత్రులారా!
ప్రతి ఒక్కరు పతివ్రతల పేర్లు చెప్పినపుడు
ద్రౌపది పేరు చెబుతారు. కాని అనుమానం
5 మంది భర్తలున్న ద్రౌపది పతివ్రతా?
ఈ సందేహాన్ని నివారించే ప్రయత్నం చేసిన
నండూరి శ్రీనివాస్ గారి వీడియో
వీక్షించండి
సాహితీమిత్రులారా!
రాళ్ళబండి కవితాప్రసాద్ గారి
ఒక ప్రయాణం కథ
మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం తరువాత శ్రీకృష్ణుడు
రాధను కలుసుకోవడాని ఒక ప్రయాణం
కథనం కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ఏ పూవులను ఎవరి పూజకు ఉపయోగించాలో
ఇక్కడ కొంత విషయాన్ని తెలుసుకుందాం-
గణేశం తులసీ పత్రైః నవదుర్గాశ్చైవ దూర్వయా,
ముని పుష్పైః తథా లక్ష్మీకామో నచార్చయేత్
సంపదలపైన ఆపేక్షకలిగి దేవతలను పూజింపగోరేవారు తులసీ దళాలతో వినాయకుని, నవదుర్గలను, పార్వతిని పూజించరాదు. అవిశపూలతో సూర్యుని పూజింపరాదు అలా చేస్తే సంపదంతా పోయి ఏడేళ్ళు జ్యేష్టాదేవి ఇంటనిలుస్తుంది
జపా కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ భవైః
కేతకీ భవ పుష్పశ్చ నై వార్చ్యః శంకర స్తథా
జపా, మొల్ల, దిరిసెన, మాలతీ, మొగలి పూలతో శివార్చన చేయరాదు
శిరీ షోన్మత్త గిరిజా, మల్లికా శాల్మలీ భవైః
అర్కజైః కర్ణికారశ్చ, విష్ణు నార్చ్యః సితాక్షతైః
దిరిసెన, ఉమ్మెత్త, కొండమల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు - ఈ పూలతో మహావిష్ణువును పూజించరాదు. శూన్యఫలం. అంతేగాక తెల్లవిగాని, కుంకుమ, పసుపు కలిపిన అక్షతలు కూడ విష్ణువుకు ఉపయోగించరాదు. ఆ ఇంట లక్ష్మి ఉండదు. అపరిశుభ్రంగా, చేతులతో, గుడ్డలో కట్టుకు తెచ్చిన పూలు, భక్తిలేని అర్చనలు దైవానికి సమర్పితం కానేరవు.
సాహితీమిత్రులారా!
భూదేవి విష్ణువు భార్యకదా
మరి భూదేవి కుమార్తె సీత
రామునికి ఎలా భార్య అయింది
ఈ వీడియో చూడండి -
సాహితీమిత్రులారా!
రెడ్డిరాజుల యుగంలో ఉన్న బడబానల భట్టు
ఏవూరివాడో తెలియదు కాని ఒకసారి ఆయన
త్రిపురాంతకం నుండి శ్రీశైలం వెళుతూ
ఒకచోట మకాం చేశాడు. తెల్లవారుజామున స్నానం చేసి
సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నపుడు చేతి ఉంగరం జారి చెరువులో పడింది
వెంటనే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం చెప్పాడు
బడబానల భట్టారకు
కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
బిడువేళ నూడి నీలో
బడియె దటాకంబ నీటి బాయుము వేగన్
ఈ పద్యం చెప్పిన రెండు గడియలలో చెరువు ఎండిందట
కవిగారు తన ఉంగరం తీసుకొని చక్కాపోయాడు- అని
అప్పకవి తన అప్పకవీయంలో ఈ పద్యాన్ని పొందుపరిచాడు.
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కృష్ణ పక్షంలోని
కవిత నా జీవితము - ఆస్వాదించండి-
వింతగా దోచు నాదు జీవితము నాకె!
జిలుగు వెన్నెలతో చిమ్మచీకటులతొ;
అమల మోహన సంగీతమందు హృదయ
దళన దారుణ రోదన ధ్వనులు విందు;
వక్రగతి బోదు చక్కని పథమునందె,
రాజపథమునకై కుమార్గమున జూతు;
గరళమేతిందు కడుపార నెరిగి యెరిగి;
అవల ద్రోతు చేతులార నమృతరసము;
విస మమృతమట్టు లమృతంబు విసమురీతి;
చిత్రచిత్రగతుల మార్చు జీవితంబు!
సాహితీమిత్రులారా!
అమ్మ చెబితే వినాలి(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
సంస్కృతంలో పంచకావ్యాలున్నట్టే తెలుగులో కూడ
ఐదు ప్రౌఢప్రబంధాలను పంచకావ్యాలు అంటారు.
అవి 1. మనుచరిత్ర, 2. వసుచరిత్ర, 3. రాఘవపాండవీయం,
4. శృంగారనైషధం, 5. ఆముక్తమాల్యద
ఇవికాకుండా పంచడప్పులనేవి బ్రౌన్ దొరగారి కాలంలో వెలుగులోకొచ్చాయి.
ప్రామాణిక పురాణాలలోని ప్రక్షిప్తాలను ఆధారం చేసుకొని ఆ పురాణపురుషులకు అంటగట్టి వ్రాసే కేవల కల్పనాకథలను పంచడప్పులు అంటారు - అని బ్రౌన్ దొరగారి పండితుల కథనం
పురాణడప్పులుగా చెప్పబడేవి 5
1. మైరావణ చరిత్ర,
2. శతకంఠ రామాయణం,
3. కృష్ణార్జున సంవాదం,
4. గంగాగౌరీ సంవాదం,
5. జైమినీ భారతం
జైమినీ భారతాన్ని తరువాతి కాలంలో తొలగించి
కుశలవ కథ ను చేర్చారు బ్రౌన్ దొరవారు.
సాహితీమిత్రులారా!
నాన్న(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
జీవన్ముక్తుడు అంటే జీవించికూడా ముక్తి పొందినవాడు.
అలాంటివాణ్ణి శంకరభగవత్పాదులవారు ఇలా వర్ణిస్తారు-
క్వచిత్ బాలై సార్ధం కరతలగతావై సహిసితైః
క్వచి త్తారుణ్యాలంకృత నవవధూస్సహరమన్
క్వచిత్ వృద్ధైశ్చింతాకలిత హృదయైశ్చాపివిసన్
మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః
ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకుని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం,
కిలకిల నవ్వుతూ క్రీడా పరులైన బాలురతో ఆడడం, మరొకప్పుడు అలంకృతలైన
స్త్రీలతో చరిస్తూ ఉండడం, ఇంకొకప్పుడు సాంసారిక చింతాజాలంతో క్రుంగిపోయే
ముసలివాళ్ళతో కలిసి విచారించడం, ఇన్ని విధాల చరిస్తున్నా జీవన్ముక్తుడు అయిన
యతివరుడు జ్ఞానయోగదీక్షామహిమవల్ల దేహతాదాత్మ్య భ్రాంతిని పొందడు-
అని భావం
ఇలాంటి జీవన్ముక్తులు ఉన్నా మనం గుర్తించగలమా ఏమో
సాహితీమిత్రులారా!
పరోపకారం(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
వందరెక్కల స్త్రీ (కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
అనే గ్రంథం కూర్చారు ఇందులోని ఇతివృత్తం(కథ)
సముద్రమథనం. ఇది మహాభాగవతం, బ్రహ్మాండపురాణం,
భారతం మొదలైన వాటిలో ప్రఖ్యాతి పొందినది.
ఇందులో కవిగారు కూర్చిన సరస్వతీదేవి స్తుతి
ఇక్కడ గమనిద్దాం-
దేవానామపి దైవతం గురుమపి ప్రాచాం గురూణామిహ
శ్రీమంతం మదనాంతకం కథమపి స్తోతుం కృతో నిశ్చయః
తేన త్వాం త్వరయామి భారతి బలాత్కృష్టా2పి దుష్టే పథి
ప్రాసేనోపహతాపి జాతు కుపితా మా స్మ ప్రసాదం త్యజః
దేవదేవుడూ, ప్రాచీనగురువులకు గురువూ, అష్టైశ్వర్యసంపన్నుడూ
అయిన మదనాతకుణ్ణి(శివుణ్ణి) ఏలాగైతేనేం స్తుతింప నిశ్చయించాను
(కామం బంధం, కామదహనం బంధవిముక్తి. ఆ ముక్తినిచ్చేవాడు శివుడు
మరొకడు కాదు) కావున ఓ భారతీ(సరస్వతీ) తొందరగా వచ్చి నేను చెప్పినట్లు
నా రచనను వేగంగా సాగింపచేయి. వేదవేదాంతమార్గాల్లో విహరించే నిన్ను
వికటాక్షర బంధ పారుష్యాది దుష్టమైన కావ్య మార్గంలో బలాత్కారంగా లాగుతున్నాను.
ఛేకానుప్రాస వృత్త్యనుప్రాసలనే బల్లేలతో పొడుస్తాను. ఐనా ఏమాత్రం కోపగించక నాపై
ప్రసాదం(అనుగ్రహం. నారచనలో ఝటిత్వర్థావగత రూపమైన ప్రసాదగుణాన్ని) చూపడం
ఎప్పుడూ మానొద్దు (సరస్వతీదేవీ) - అని భావం
ఇది స్తుతిమాదిరైనా వుందా
అంతా ఆజ్ఞాపించినట్లే సాగిందికదా
ఈ ప్రార్థనా శ్లోకం
సాహితీమిత్రులారా!
తీరని ఋణం తీరిపోయింది(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
పెంకుటిల్లు (కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
రోల్ మాడల్ (కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
పోలిపెద్ద వెంకన్నగారి లావణ్య శతకం
శృంగారశతకం దీనిలోని
ఈ పద్యం గమనించండి-
ఇందులో నాయకుడు నాయికను బ్రతిమలాడుకొనే సన్నివేశంలోని పద్యం ఇది-
అతివ నేనొకసారి యానితే నీదు వా
తెరతేనె లేమైన దరిగిపోనె
పణఁతి నేనిసుమంత పట్టితే నీచను
బంతులంతటితోనె వాడిపోనె
యలుక లేమిటి కించుక బలుకరించంగానె
పలుకులో నమృతంబు లొలికిపోనె
కడుఁబ్రేమ నొకసారి కౌఁగిలించంగానె
కలికి నీతను వేమి కందిపోనె
వనిత నాతోడ నొకసారి కెనయగానె
దర్పకుని బొక్కసము కేమి తక్కువగునె
చాన నినుమాన నాతోన చలముబూన
వలెనటే శ్రీరామ రామ లావణ్యసీమ
(లావణ్య శతకం - 77)
సాహితీమిత్రులారా!
మనం ఇప్పుడు చాలమంది వ్రాసేవాటిలో
ఒత్తులు వుండవలసినదానికి తీసివేసి లేనిదానికి
పెట్టడం గమనిస్తుంటాము
అలాంటి వాటిలో ఇదొకటి గమనించగలరు
సమాధానం / సమాదానం
సమాధానంలో ''ద'' కు వత్తు వుంది
సమాదానంలో ''ద'' కు వత్తు లేదు
సమాధానం అంటే అంగీకారం(సమ్మతి), ఉత్తరం అని అర్థాలు
సమాదానం అంటే ఇది బౌద్ధమతానికి చెందిన అర్థం
బౌద్ధులు నిత్యకృత్యమనీ, చక్కగా గ్రహించడమని అర్థాలున్నాయి
సంసారమార్గం అంటే
మిథ్యాజ్ఞానం, యోని అని రెండర్థాలు
సాహితీమిత్రులారా!
భారతదేశంలో పురుషులే ప్రదర్శనలో పాల్గొనే
నాట్యాల సాంప్రదాయాలు-
1. కర్ణాటకల - బయలాట, యక్షగానం
2. తమిళనాడు- భాగవతమేళా, కణ్ణియంకూత్తు, తెరుక్కూత్తు
3. కేరళ - కృష్ణాట్టం, కథాకళి
4. గుజరాత్ - భవాయి
5. రాజస్థాన్ - ఖయాల్
6. హర్యానా - స్వాంగ్
7. కాశ్మీర్ - బాండ్ జస్నా
8. ఉత్తరప్రదేశ్ - నౌటంకీ(ఆగ్రా), భారత్ (బ్రజ భూమి)
రాసలీల (వారణాసి), రామలీల (రామ్ నగర్)
9. బెంగాల్ - జాత్ర
10. మణిపూర్ - జాత్ర
11. అస్సాం - అంకియ నట్
12. పశ్చిమ బెంగాల్ - చావ్ (చౌ)
13. బీహార్ - చావ్ (చౌ)
14. ఒరిస్సా - చావ్ (చౌ), గోటిపువా
15. ఆంధ్రప్రదేశ్ - కూచిపూడి, తూర్పుభాగవతం, వీధిభాగవతాలు
సాహితీమిత్రులారా!
కొంతమంది మాట్లాడేప్పుడు నవరంధ్రాల్లో
మైనం పోస్తామని, నవరంధ్రాలు మూసుకు కూర్చో
అని రకరకాలుగా మాట్లాడుతుంటారు
అలాగే ఒక
తోలు తిత్తియిది
తూట్లు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం
జీవా తుస్సుమనుట ఖాయం
అని పాడుతుంటారు
(తూట్లు అంటే రంధ్రాలు)
అసలు నవరంధ్రాలంటే ఏవి
మనిషి శరీరంలో 9 రంధ్రాలున్నాయి
అవి తలలోనే ఎక్కువున్నాయి
చెవులు - 2
కండ్లు - 2
ముక్కు రంధ్రాలు - 2
నోరు - 1
మిగిలినవి పొట్టకు దిగువన ఉంటే మలమూత్రద్వారాలు రెండు
వెరసి 9 రంధ్రాలు
మానవుని మరణం ఈ రంధ్రాలగుండా పోతుందని
వీటిలో
తలలోని రంధ్రాగుండా పోతే పుణ్యలోకాలకు పోతారని
మిగిలిన వాటిగుండా పోతే పుణ్యలోకాలకు పోరని
నమ్ముతారు.
సాహితీమిత్రులారా!
మనం ఉత్తరాలలోనూ ఫోన్లలోనూ యోగక్షేమాలను
బంధువులను మిత్రులను పరామర్శిస్తుంటాము
అసలు యోగక్షేమాలంటే ఏమిటి?
అంటే ఏమీలేదు
సంపదను సమకూర్చుకోవడం యోగమట
దాన్ని భద్రం చేసుకోవడం క్షేమమట
రెండు కలిపితే యోగక్షేమాలు
సాహితీమిత్రులారా!
పురిపండా అప్పలస్వామి గారి గేయం
1932లో వైశాఖిలో ప్రచురితమైంది.
ప్రియతమా!
ఈ కుసుమ విశ్వాస
మృదు పరీమళ లవమె
భరియింపలేదు నా
భాగ్యమెరుగని మనసు
ప్రియతమా! నామ్రోల
సురభిళోత్సవమేల
వలపె మరిచిన బ్రతుకు
కలలుగా జాలిగా
కనుమూసి కొను నిశాం
గనశయ్య నశియించు
నలదోయి లేవెలుం
గుల తారకయునేడు
కుములకే కుములకే
కుములునా చితిలోన
ఏ చిరంతన వాంఛ
లెగయునో పొగలుగా
సవరింపకోయి నీ
యమృత వీణా గళము
ప్రియతమా! ప్రియతమా!
సాహితీమిత్రులారా!
"పండగ రోజు" - నాటకం
రచన : శ్రీ నండూరి సుబ్బారావు
నిర్వహణ : శ్రీ పాండురంగ
ప్రసారం - ఆలిండియా రేడియో హైదరాబాదు
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
అయ్యలరాజు రామభద్రునికి ముత్తాత
అయిన అయ్యలరాజు తిప్పయ్య
కృత రఘువీరా జానకీనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి-
రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినా డందునో
రవిసూనున్ గృప నేలి యింద్రసుతు బోరం ద్రుంచినా డందునో
యివి నీయందును రెండునుం గలవు నీకేదిష్టమో చక్కగా
రవివంశాగ్రణి తెల్పగదవయ్య రఘువీరా జానకీనాయకా
సూర్యుని కుమారుని చంపి ఇంద్రకుమారుని
రక్షించినాడని అందునా
రవికుమారుని కృపతో నేలి
ఇంద్రకుమారుని యుద్ధంలో చంపినాడందునా
నీకేది ఇష్టమో చెప్పవయ్య ఓ రువంశ వీరుడా!
జానకీనాయకా! ఓ రామా! అని అడుగుతున్నాడు
ఇందులో రెండింటియందు రవికుమారుడు,
ఇంద్రకుమారుడు అని అనడంతో కొంత పురాణ
ఇతిహాస పరిజ్ఞానం అవసం ఏర్పడుతున్నది.
రామాయణంలో వాలి ఇంద్రుని కుమారుడు,
సుగ్రీవుడు సూర్యునికుమారుడు
ఇక్కడ ఇంద్రునికుమారుని చంపాడు.
భారతంలో అర్జునుడు ఇంద్రునికుమారుడు,
కర్ణుడు సూర్యునికుమారుడు ఇక్కడ
సూర్యకుమారుడైన కర్ణుని చంపించాడు
రెండూ నువ్వే చేశావుకదా
వీటిలో నీకేది ఇష్టమో చెప్పవయ్యా
ఓ శ్రీరామచంద్రా అంటున్నాడు కవి.
ఎలా చెప్పగలడు మరి
ఇలాగే తిక్కన ఒక ప్రశ్నవేశాడు
హరిహరనాథునికి -
ఓ ప్రభూ, నీకు అస్థిమాల ఇష్టమా,!
కౌస్తుభం ఇష్టమా!, కాలకూటం రుచిగా ఉంటుందా?
యశోదాదేవి చనుబాలు రుచిగా ఉంటాయా?
సెలవియ్యవయ్యా -
అని అంటే ఏది కాదంటాడు ఆయన.
సాహితీమిత్రులారా!
విజయవిలాసము కృతిభర్త రఘునాథని కీర్తిని చేమకూర వెంకటకవి
ఎలావర్ణించారో ఈ పద్యంలో గమనించవచ్చు ఆయన చమత్కారాన్నీ
గమనించవచ్చు
రసికుడౌ రఘునాథుని కీర్తి యౌరా తొల్త వాగ్బంధమున్
రసవాదంబును, రాజ్యవశ్యవిధి నేరంబోలుఁ గాకున్న, వె
క్కసపుం బ్రౌఢి వహించి, శేషఫణి మూఁగంజేయఁ, దారాద్రి ను
ల్లసము ల్వల్కఁగ ఛత్ర చామర మహాలక్ష్ముల్ నగన్ శక్యమే
తాత్పర్యం-
రఘునాథుని కీర్తి - కీర్తి తెల్లగా ఉంటుంది కాబట్టి - తెల్లదనమునకు ప్రసిద్ధిపొందిన సరస్వతీదేవిని, పాదరసమును, చంద్రుని, ఆదిశేషుని, వెండికొండను శ్వేత ఛత్రచామరాలను మించినదని భావం
ఈ పద్యంలో విద్యావతియైన ఒకకాంత 1. వాగ్బంధము, 2. రసవాదము, 3. రాజవశ్యము అనేవిద్యలను మొదట అలవరచుకొని ఆ తరువాత అత్యంత నిపుణతతో విజయయాత్రకు బయలుదేరి వేయినాలుకలుగల భాషానిధియైన ఆదిశేషుని నోరెత్తకుండా చేసి, వెండికొండను అల్పమైన విలువగలదానిగా పరిహసించి, రాజలాంఛనాలైన ఛత్రచామరముల ఆధిక్యాన్ని ఈసడిస్తున్నట్లున్నది అని చమత్కారం
సాహితీమిత్రులారా!
ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు
"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే
ఈ పద్యం చూడండి.
ఎంత
చమత్కారంగా ఉందో!
జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!
గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే
(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా
మాట్లాడుకోవటానికి నోచుకోలేదట
ఎందుకంటే .........
తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని
- ఇన్ని విడవనివి ఉంటే
ఇక ఇక ఏకాంతం ఎక్కడ)
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి
కృష్ణపక్షం నుండి నా ప్రేమ - అనే
ఈ కవిత ఆస్వాదించండి-
క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన
మలినమౌ నా హృదయము ధామ మెటులయ్యె
నతి విశుద్ధము మధురము నఘరహితము
ప్రణయమున కంచు సందియ పడుదువేమొ
ప్రేయసీ! శర్వరీ తమోవీధుల బడి
చంద్రుడు రాడె పూర్ణతేజస్వియగుచు
అఘవిదూషిత మీ హృదయంబునందె
ప్రేమ కోమల తమము పవిత్రమయ్యె
సాహితీమిత్రులారా!
ఒక చిత్రకారుడు గీచిన చిత్తరువును చూచి ఒక కవి
తనకు కలిగిన భావనను తన కవిత్వంలో ఎలా వెలార్చారో
చిత్తగించండి-
పలుకక పల్కరించుగతిఁ బాడక పాడినరీతి తేనియల్
చిలుకఁగ నవ్వకే నగిన లీలఁగనుంగొనుచున్న నాదు క
న్నుల కతిసుందరంబగు మనోజ్ఞపు చిత్తరువందు నున్న నీ
చెలువముగాంచి నేనొక చిత్తరువైతిని గాదె కోమలీ
అని కొనియాడి అంతటితో ఊరుకొనక మరీ ఇట్లంటున్నాడు-
వలుద నిగారింపు బటువు వట్రువ యబ్రపు నిబ్బరంపు గు
బ్బలు తెలినీటి పోల్కిఁగను పట్టెడు సన్నని జిల్గు పయ్యెద
న్వెలువడి త్రుళ్ళి పైకుబికె వీలఁటె గోలలకేల చేలముం
గలికిరో కేలఁ గప్పవు -
అని సిగ్గు విడిచి అడిగి చప్పున తెలివి తెచ్చుకొని-
అటుగాదఁటె చిత్తరువందు కోమలీ!
అని సరిపుచ్చకొనెను
ఆహా చిత్రకళా ప్రభావము పామరులకే గాదు పండితులను సైతము
మోహింప చేయజాలును కదా
సాహితీమిత్రులారా!
తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -
ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!
ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.
రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.
సాహితీమిత్రులారా!
మొట్టమొదట కవి లేడట ఎవరితో కవి ప్రాంభమయ్యాడో
ఈ శ్లోకం వివరిస్తుంది గమనించండి-
జాతే జగతి వాల్మీకౌ కవిత్వభిధా2భవేత్
కవీ ఇతతితో వ్యాసే కవయస్త్వయి దండిని
జగత్తులో వాల్మీకి పుట్టగానే కవి అనే ఏకరూప శబ్దం వచ్చిందట
అంతకుమునుపు కవి అనేవాడు లేడని భావం
తరువాత వ్యాసుడు పుట్టగనే కవీ అనే ద్వివచన రూపం
దండి పుట్టగనే కవయః అనే బహువచన రూపం వచ్చాయట
అని శ్లోక భావం
అయితే కొంత మంది దండి మీద అభిమానంతో
ఎవరో కూర్చరీ శ్లోకం అని అంటున్నారు
వాల్మీకి, వ్యాసుల తరువాత దండి వారిఅంత కవి అనిమరి కొందరి భావన.
సాహితీమిత్రులారా!
ఆంధ్రప్రస్థానం నాటిక
కథ, దర్శకత్వం - సి.యన్.మూర్తి
వీక్షించండి-
సాహితీమిత్రులారా!
మహాభారతంలో ఒకచోట చెప్పబడిన శ్లోకం గమనించండి-
రామస్య వ్రజనం బలే ర్నియమనం పాండో సుతానాం వనం
వృష్ణీనాం విధనం నలస్యనృపతే రాజ్యాత్పరిభ్రంశనమ్
నాట్యాచార్యక మర్జునస్య పతనం సంచిత్యలంకేశ్వరే
సర్వం కాలవశాజ్జనో2త్ర సహతే కః కం పరిత్రాయతే?
రాముడంతవానికి ప్రవాసము సంభవించెను.
బలిచక్రవర్తి పాతాళమం దణచబడెను.
యాదవులకో సంఘమరణం సంభవించెను.
నలమహారాజు రాజ్యభ్రష్టుడాయెను.
అర్జునుని వంటి వీరుడు నాట్యాచార్య వృత్తిని అవలంబించెను.
రావణుని వంటివాడు పడిపోయెను.
అందరు కాలమునకు వశులు కావలసిందే.
ఎవరు ఎవరిని రక్షించగలరు?
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కష్ణశాస్త్రిగారి కృష్ణపక్షంలోని
స్వేచ్ఛాగానం - 2 ను ఆస్వాదించండి-
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు
నా యిచ్చయే గాక నాకేటి వెరపు
కలవిహంగమ పక్షముల దేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధురగానమున
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
మొయిలు దేనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరుపునై మెరసి
పాడుచూ చిన్కునై పడిపోది నిలకు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను భువినుండి దివికి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
శీకరంబులతోడ చిరుమీలతోడ
నవమౌక్తికములతో నాట్యమ్ములాడి
జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
పరుగెత్తి పరుగెత్తి పవనునితోడ
తరుశాఖ దూరి పత్రములను జేరి
ప్రణయరహస్యాలు పలుకుచు నుందు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
అలరుపడంతి జక్కిగింత వెట్టి
విరిచేడి పులకింప సరసను బాడి
మరియొక్క ననతోడ మంతనంబాడి
వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనలగ్రోలి సోలుటకు
పూవు పూవునకు బోవుచునుందు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
పక్షి నయ్యెద చిన్న ఋక్ష మయ్యెదను
మధప మయ్యెద చందమామ నయ్యెదను
మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాట నయ్యెద కొండవాగు నయ్యెదను
పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఏలొకో యెప్పుడో యెటులనో గాని
మాయ మయ్యెదను నేను మారిపోయెదను
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెరపు?
సాహితీమిత్రులారా!
" వాన వెలిసింది" - నాటకం
రచన - ఎన్.ఆర్.నంది
నిర్వహణ - వై.సరోజా నిర్మల
నాటకంలో పాల్గొన్నవారు
చాట్ల శ్రీరాములు, పి.వి.రావు
కె.వి.ప్రదీప్ కుమార్, ఎస్.ఆర్.కృష్ణ
ప్రసారం - ఆకాశవాణి హైదరాబాదు
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బావగారొచ్చారు (హాస్య రేడియో నాటకం)
రచన : శ్రీ నండూరి సుబ్బారావు
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
కామినేని మల్లారెడ్డిగారి షట్చక్రవర్తి చరిత్రములో
నవవధువును ఈ క్రిందిపద్యంలో వర్ణించారు
ఎంత అద్భుతంగా ఉందో గమనించగలరు-
మగని వీక్షించి దేహళీమధ్యసీమఁ
ద్రపయు నెనుకకుఁ బ్రేమ ముందఱికిఁ దిగువ
భామ గనుపట్టె నాలీఢపాదయగుచు
మరునితోఁబోర నిలుచున్న మహిమ మెఱయ
(షట్చక్రవర్తి చరిత్రము - 5 - 114)
ఈ పద్యంలో మొదటిగా పడకింటికి వెళుతున్న ఒక నవవధువును వర్ణించాడు కవి కామినేని మల్లారెడ్డిగారు.
పడకింటి గడపవరకూ వెళ్ళి లోపల భర్తను చూచి దేహాళీ మధ్యసీమ(గడపమధ్య)లో
ఆగిపోయింది. త్రప(సిగ్గు) వెనుకకు లాగుతోంది. భర్తమీద ప్రేమ ముందరికి లాగుతోంది.
ఆలీఢపాదయై(ఒకపాదం గడపకు లోపల ఒకపాదం గడపకు వెలుపల ఉంచి) నిలబడింది.
ఆ స్థితిలో మరుని(మన్మథుని)తో పోరన్(యుద్ధంచెయ్యడానికి)
నిలబడ్డ తీరుగా ఆ యువతి కనబడింది- అని కవి వర్ణించాడు
సాహితీమిత్రులారా!
పానుగంటివారి హాస్య నాటిక
కంఠాభరణం రేడియోలో
ప్రసారం చేయబడింది.
అది ఇక్కడ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
రచన - పొత్తూరి విజయలక్ష్మి
ప్రసారం ఆలిండియా రేడియో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
పింగళి సూరనగారి రాఘవపాండవీయంలోని ఈ పద్యం
అజమహారాజు(మరో అర్థంలో పాండురాజు) జైత్రయాత్రకు
వెళుతున్న సందర్భంలో కూర్చిన పద్యం
గమనించండి ఎంతటిదో-
తలపం జొప్పడి యొప్పెనప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రా సము
త్కలికారింఖ దసంఖ్యసంఖ్య జయవత్కుంభాణరింఖా విశృం
ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నేఱన
ర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖాలేప శంకాకృతిన్
(రాఘవపాండవీయం - 1-09)
మహారాజు జైత్రయాత్రకు వెళ్లగా
అతని వెంట గుఱ్ఱపు దండు భేరీదళం ఉన్నది.
అతని గుఱ్ఱపు దండు విశృంఖలంగా పరుగెత్తుతూ ఉంటే
వాని గిట్టలతో లేచిన దుమ్ముతెరంతా ఆకాశగంగలో పడి
అదంతా పలుచని బురదగా మారిపోతోంది.
రాజుగారి వెంట ఉండే భేరీల మ్రోతలకు దద్ధరిల్లి
ఆకాశం బీటలు వారుతుండగా
ఆ ఆకాశ గంగ యొక్క పంకం(బురద) అంతా నెఱ్ఱెలు వారిన
ఆకాశాన్ని పూయటానికి కలిపిన అలుకువలె ఉన్నది - అని భావం
ఎంతటి ఊహోకదా!
సాహితీమిత్రులారా!
ఎఱ్ఱనగారు తన నృసింహపురాణంలో తృతీయాశ్వాసంలో హిరణ్యకశిపుడు
వనవిహారం వెళ్ళినపుడు అక్కడ చీకటిపడగా అక్కడే గుడారాలు వేసుకొని
ఉన్నాడు అప్పుడు చంద్రోదయం తర్వాత మధుపానం చేయడం మొదలు పెట్టారు
ఆ సందర్భంలో మధుపాత్రలో చంద్రుడు ఎలా కనిపించాడో కొన్ని పద్యాల్లో వర్ణించారు
ఎఱ్ఱనగారు. వాటిలోని ఒక పద్యం ఇక్కడ-
సురుచిర పానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం
దురుఁడు ప్రకంపితాంగకముతోఁదికించెఁ దదాననాంబుజ
స్ఫురిత వికాస వైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె
చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకు చాడ్పునన్
(నృసింహపురాణము - 3- 97)
ఒక సుందరి(అందాలరాశి) చేతిలో
అందమైన పానపాత్ర
అందులో నిండు చందురుడు ప్రకంపిత (కదలాడే)
అంగకముతో(రూపంతో) ఎలా కనిపించాడంటే
ఆమె ముఖపద్మం తాలూకు విస్ఫురిత వికాస వైభవాల సొంపుల్ని
అణకువతో దొంగిలిండానికి వేగంగా వచ్చి పానపాత్రలో పట్టుబడి
నిశ్చేష్టుడై భయంతో వణికిపోతిన్నట్టు కనిపించాడు
(ఆమె కంటికి అలా అనిపించాడు
లేదా ఆమె అలా తిలకించింది.) - అని భావం.
సాహితీమిత్రులారా!
కంకంటి పాపరాజు గారు తన
ఉత్తర రామాయణంలో ఆరవ ఆశ్వాసంలో
సీతారాముల జలక్రీడావర్ణన లోని
ఒక పద్యం గమనించండి-
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
(ఉత్తరరామాయణము - 6-82)
ఈ పద్యంలో యువతులు సరస్సులో దిగి ఒక్కోసారి ఒక్కొక్క అవయవం కనబడే విధంగా ఒక్కొక్క విధమైన ఈత ఈదుతుంటే ఆ సరస్సు ఎలావుందో కంకంటివారు వర్ణిస్తున్నాడు
మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ
గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
కామినులు(స్త్రీలు) ముఖాలు కనపడే విధంగా వెల్లకిలా నిలువుగా నిగిడి(సాగి) ఈదుతుంటే కొలనంతా చంద్రబింబాలతో నిండినట్లయింది ప్రతిముఖం చంద్రునిలా ఉండడంచేత
గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ
రం బెల్లఁ గమలకోరకము లయ్యె
కుచాలు కనబడేవిధంగా ఆ కొమ్మలు(యువతులు) ఈదుతుంటే సరస్సంతా కమలకోరకమ్ముల(తామర మొగ్గల)తో నిండినట్లుంది. వారి కుచాలు తామరమొగ్గల్లా ఉండటంతో
గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా
కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ
కొమెరలు(యువతులు) బోర్లా పడుకొని కేశపాశాలు నీటిమీద పరుచుకొని కనబడే విధంగా ఈదుతుంటే సరస్సంతా దట్టమైన చీకటితో నిండినట్టయినది. అంతమంది స్త్రీల ముడుల నల్లదనమంతా సరస్సంతా వ్యాపించడంతో
బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద
దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
బిసరుహాననలు(తామరపూలవంటి ముఖాలున్న స్త్రీలు) పిఱుదులు కనబడేవిధంగా ఈదుతుంటే సరస్సుమధ్యంతా దీవులతో నిండినట్లయింది. పిఱుదులు దీవుల్లా వుండంతో
బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద
నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకర మెల్ల బంగార మయ్యె
కాంచనాంగులు(బంగారువంటి శరీరంగల యువతులు) శరీరాలు కన్పడేవిధంగా సరస్సంతా బంగారమైంది.
సాహితీమిత్రులారా!
ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.
ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
(ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.
కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -
చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు