Sunday, September 12, 2021

సూరనగారి జైత్రయాత్ర

 సూరనగారి జైత్రయాత్ర




సాహితీమిత్రులారా!



పింగళి సూరనగారి రాఘవపాండవీయంలోని ఈ పద్యం

అజమహారాజు(మరో అర్థంలో పాండురాజు) జైత్రయాత్రకు 

వెళుతున్న సందర్భంలో కూర్చిన పద్యం 

గమనించండి ఎంతటిదో-


తలపం జొప్పడి యొప్పెనప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రా సము

త్కలికారింఖ దసంఖ్యసంఖ్య జయవత్కుంభాణరింఖా విశృం

ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నేఱన

ర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖాలేప శంకాకృతిన్

                                                                                                      (రాఘవపాండవీయం - 1-09)

మహారాజు జైత్రయాత్రకు వెళ్లగా 

అతని వెంట గుఱ్ఱపు దండు భేరీదళం ఉన్నది. 

అతని గుఱ్ఱపు దండు విశృంఖలంగా పరుగెత్తుతూ ఉంటే

వాని గిట్టలతో లేచిన దుమ్ముతెరంతా ఆకాశగంగలో పడి 

అదంతా పలుచని బురదగా మారిపోతోంది. 

రాజుగారి వెంట ఉండే భేరీల మ్రోతలకు దద్ధరిల్లి 

ఆకాశం బీటలు వారుతుండగా 

ఆ ఆకాశ గంగ యొక్క పంకం(బురద) అంతా నెఱ్ఱెలు వారిన 

ఆకాశాన్ని పూయటానికి కలిపిన అలుకువలె ఉన్నది - అని భావం

ఎంతటి ఊహోకదా!

No comments:

Post a Comment