Friday, November 27, 2020

పెరంబుదూరు వారి చమత్కారం

 పెరంబుదూరు వారి చమత్కారం




సాహితీమిత్రులారా!



పెరంబుదూరు లక్ష్మీనరసింహాచార్యులుగారు

ఒకసారి తిరుమల వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులు

నచ్చక భగవంతునితో మొరపెట్టుకున్నట్లు కొన్ని

పద్యాలు రాశారు. వాటిలోని ఒక పద్యం ఇది చూడండి


తిండిలేక గాదు, పరదేశము చూచుటకిచ్చగాదు, మా

యండలు బాసివచ్చి భవదంగణమందున పస్తుపండగా

గండమదేమి భక్తులను గాచెడి సాహసివండ్రుగాని నీ

తొండిదివాణమందు వడ దోశెల నమ్ము దురయ్యదుర్గతిన్


భక్తులు తిండిలేక గాని,

దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు,

వారి బలగాన్ని వసతులను వదలుకొని వచ్చి

నీ వాకిట్లో పస్తుపడుకోవలసి రావటం ఏమిగతి

నీవు భక్తులను కాపాడే వాడవంటారే,

కాని నీ అక్రమాల కార్యాలయంలో వడలు,

దోసెలు వంటి ప్రసాదాలను అమ్ముతారా

అది ఏమి దుర్దశ భక్తులకు నీ ప్రసాదం కూడ

ఉచితంగా అందించలేవా - అని ఆవేదనతో

కవి అన్నాడని భావం


అది శ్రీవారు విన్నారేమో

ఇప్పుడు నిత్యాన్నదాన సత్రం ఏర్పడింది.


No comments:

Post a Comment