Monday, November 16, 2020

కోమలితో పవళించునట్టి నాసరసుని జేరవే

 కోమలితో పవళించునట్టి నాసరసుని జేరవే




సాహితీమిత్రులారా!


పానకాలరాయకవి

తన మనసుకు ప్రబోధిస్తూ

విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం ఇది

తన మానస శతకంలో శ్రీమహావిష్ణువు దినచర్యను 

ఎంత చక్కగా నేటి మన ముఖ్యమంత్రుల, ప్రధానమంత్రుల

దినచర్యతో సరిపోల్చే విధంగా వివరించాడో గమనించగలరు-

తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!

తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!


No comments:

Post a Comment