Friday, October 6, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 5




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........



66. మిథిలా నగరానికి వెళుతూ విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు
      ఏ నది తీరంలో రాత్రికి నిద్రించారు?
     - శోణానది

67. శోణనదిని ఇప్పుడు ఏమంటున్నాము?
    - సోన్ నది

68. శోణనదికి మరోపేరు-?
     -మాగధి

69. మాగధి పేరు మీద ఏర్పడినదేశం-?
     - మగధ దేశం

70. మగధదేశ రాజధాని?
     - గిరివ్రజ పురం

71. కుశుడు - ఎవరి కుమారుడు?
    - బ్రహ్మమానస పుత్రుడు

72. కుశునికి విదర్భరాజకన్యకు పుట్టినవారు?
     - కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు

73. కుశనాభుడు, ఘృతాచి అనే అప్సరసకు పుట్టిని నూరుగురు
      ఆడపిల్లలు తమను మోహించిన వాయుదేవునితో ఏమన్నారు?
      - మేము స్వతంత్రలంకాదు, మేము మానాన్న కూతుళ్లం.

74. కుశనాభుని కుమార్తెలను వాయుదేవుడు ఏమని శపించాడు?
      - మఱుగుజ్జులై పొమ్మని శపించాడు.

75. కుశనాభుని కుమార్తెలు మఱుగుజ్జులైన ప్రదేశానికి పేరు?
     - కన్యాకుబ్జము(కనౌజ్)

75. కుశనాభుని కుమార్తె కుబ్జత్వం ఎలా పోయింది?
      - వీరిని పెండ్లాడదలచి బ్రహ్మదత్తుడనే కాంపిల్య నగరరాజు
         వారి చేయిని పట్టుకోగానే వారి కుబ్జత్వం పోయింది.

76. కుశనాభుని కుమారుడెవరు?
     - గాధిరాజు

77. గాధిరాజు కుమార్తె ఎవరు?
     - సత్యవతి

78. సత్యవతి భర్త -?
     - ఋచీక మహర్షి

79. సత్యవతికి మరోపేరు ?
     - కౌశికి

80. కౌశికి తమ్ముడు-?
     - విశ్వామిత్రుడు

No comments:

Post a Comment