రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక
సాహితీమిత్రులారా!
శ్రీకృష్ణదేవరాయలుచే పెద్దనగారికి స్వయంగా గండపెండేరము తొడిగించిన ఉత్పలమాలిక
ఒకసారి రాయలవారు తన సభ అయిన భువనవిజయానికి వస్తూ వస్తూ.. తనతో పాటూ ఒక బంగారపళ్ళెంలో పెట్టి ఉన్న గండపెండేరాన్ని కూడా తీసుకు వచ్చారు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమంగా కవిత్వం చెప్పగలిగిన కవిదిగ్గజానికి ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తానన్నారట. అష్టదిగ్గజ కవులంతా తర్జనభర్జన పడుతున్నారు. అప్పుడు రాయలవారు
“ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో?” అన్నారట.
అంటే.. నేను గండపెండేరాన్ని బహూకరిస్తున్నాను, తీసుకోండి అంటుంటే.. ఒక్కరూ తీసుకోరేమిటి అని అన్నమాట. రాయలవారు అన్న మాటలు ఉత్పలమాల వృత్తంలో 2 పాదాలలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారు లేచి
“పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే?
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్రుపా!” అంటూ మిగిలిన రెండు పాదాలనూ పూరించారు.
అంటే ఓ రాజా! పెద్దన పోలిన పండితులు ఈ భూప్రపంచంలో లేరని నీకు తెలియనిదా. కనుక ఆ గండపెండేరం నాకే బహూకరించు అన్నారట. మరి అంటే సరిపోతుందా.. రాయలవారు అడిగినట్లుగా సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని గుప్పించాలి కదా. అప్పుడు పెద్దన గారు అందుకున్నదే ఈ ఉత్పలమాలిక. ఉత్పలమాల ఛందస్సులో, పద్యంలా కేవలం నాలుగు పాదాలతో ఆపకుండా అంతకు మించి మాలికలా అల్లుకుంటూ పోయేదే ఉత్పలమాలిక. పెద్దన గారు చెప్పిన ఉత్పలమాలికేమిటో చూద్దాం.
Rajan PTSK గారికి ధన్యవాదములు
No comments:
Post a Comment