Wednesday, February 22, 2023

డా.కేశవరెడ్డి రచన - చివరి గుడిసె (నవలా పరిచయం)

 డా.కేశవరెడ్డి రచన - చివరి గుడిసె 

(నవలా పరిచయం)






సాహితీమిత్రులారా!

పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945  నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.



No comments:

Post a Comment