Sunday, April 23, 2023

కఠోపనిషత్తులో ఏముంది? యముడు - నచికేతుడు కథ

 కఠోపనిషత్తులో ఏముంది? 

యముడు - నచికేతుడు కథ 




సాహితీమిత్రులారా!

యమధర్మరాజుకీ, నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమవుతుందన్న విషయమైన జరిగిన సంవాదమే ఈ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు రెండు భాగాలుగా, ఆరు అధ్యాయాలుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో మొత్తం 119 మంత్రాలున్నాయి. శరీరమే రథం. ఆత్మే ఆ రథాన్ని అధిరోహించే రథికుడు. బుద్ధి సారథి. మనస్సు కళ్ళెం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాసక్తులే ఆ గుర్రాలు పరుగు తీసే మార్గాలు.. ఇలా జీవుని గురించి చెబుతుంది ఈ ఉపనిషత్తు. అలానే పరమాత్మ అంగుష్ఠమాత్రుడై ప్రతీ జీవి హృదయంలోనూ ఉంటాడంటుంది. రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, నాభి, మలమూత్ర ద్వారాలు, బ్రహ్మరంధ్రము ఇలా 11 ద్వారాలు గల కోట ఈ దేహమనీ, మరణసమయంలో ఈ ద్వారాలలో దేనినుండైన ఆత్మ నిష్క్రమించవచ్చనీ, అయితే ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమించినప్పుడే ముక్తి లభిస్తుందనీ చెబుతుంది.   “లేవండి, మేల్కొనండి” అన్న వివేకానందుని ప్రబోధం ఈ కఠోపనిషత్తునుండే తీసుకొనబడింది. ఇక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు ఈ కఠోపనిషత్తులోని మంత్రాలే ఆధారాలు.

ఇక ఈ ఉపనిషత్తులోని నచికేతుని కథలోకి వెళితే.. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


No comments:

Post a Comment