Sunday, January 19, 2020

వందేమాతర గీతం కథేంటి?


వందేమాతర గీతం కథేంటి?


Bankimchandra Chattapadhay.jpg

సాహితీమిత్రులారా!

వందేమాతర గీతం అంటే
తెలియనివారుండరంటే
పెద్దవింతేమీకాదనుకుంటా
 దీనివెనుక కథ తెలినివారు
చాలమందే వుండవచ్చు. అసలు అదేవరు ఎందుకు వ్రాశారు
ఇది మన జాతీయగీతం/పాట. దీన్ని బంకించంద్ర చటర్జీగారు వ్రాశారు.
అదెలా జాతీయగీతంగా మారింది అంటే దానివెనుకు కథ వుంది.
1838 జూన్ 27న ఈయన జన్మించారు. ఈయన సాహితీ వ్యాసంగమంతా ఒక ఎత్తయితే ఒక వందేమాతరగీతం ఒక ఎత్తు. ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. దీన్ని విడిగా ఒక పాటగా వ్రాయలేదు. దేశభక్తిని ప్రబోధించే ఒక నవల ఆనందమఠం(1882) అనేది. 1773లో బెంగాల్లో చెలరేగిన కరువు, ఒక సంతాలీల ముఠా ఆంగ్లేయుల నెదిరించి ఖజానాలు దోచుకోవడం ఈ నవల్లోని ఇతివృత్తం. దీనిలో సాధువులు దేశమాతను కొలిచే సందర్భంలో వందేమాతం గీతంగా వ్రాయబడింది.

ఆకాలంలో ఈ నవలను  చదివిన 
ఎందరో స్వాతంత్య్రం పట్ల ఆకర్షింతులై
ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఇది చాల ప్రముఖమైన
దేశభక్తి గేయంగా మారింది. దీనితో వందేమాతర ఉద్యమంకూడా వచ్చింది.
తరువాతి కాలంతో మన స్వాతంత్య్రం రావడం మన రాజ్యాంగ నిర్మాతలు
దీన్ని జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది.

No comments:

Post a Comment