Saturday, September 9, 2017

ప్రేయసి


ప్రేయసి




సాహితీమిత్రులారా!


ఆరుద్రగారి కవిత ఇది
ఇది 1945లో వ్రాయబడింది-


తల్లిగర్భంలోని జీవకణం
మొదట చీలిపోగా
ఏర్పడ్డ కణాలు
కొన్ని వారాలకి
మళ్ళా శరీరాకృతిలో
కలుసుకున్నట్టు
మన కలయిక ఎప్పుడు
పంపర పనస తొనల్లాంటి
నీ ఊపిరి తిత్తులని
తినడం చేతే
నాలో
కర్బూజా పళ్ళలాంటి
నీ కళ్ళు నవ్వుతాయి
నన్నెవరేనా
ఒక సూదిమందు గొట్టంలోకి
ఎక్కించి 
నీకు ఇంజెక్షను ఇస్తే
బావుణ్ణు
నీ రక్తనాళాల్లో పడి
ఈదుకుంటూ
నీ గుండెలిని చేరుకోవాలని
ఉంది

No comments:

Post a Comment