Monday, September 4, 2017

కుందుర్తిగారి సముద్రవర్ణన


కుందుర్తిగారి సముద్రవర్ణన




సాహితీమిత్రులారా!



గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ సమయంలో
సముద్రాన్ని సమీపిస్తున్నపుడు,
కుందుర్తిగారు దండియాత్రా కావ్యంలో
చేసిన సముద్ర వర్ణన-

మహోన్నత హిమగిరి శిఖరాల హర్షాశ్రుబిందువులు కారి
గంగై పారాయి కాబోలు బంగాళాఖాతానికి కబురెళ్ళింది
అక్కడినుండి అలలు వెళ్ళి అరేబియా సముద్రానికి చెప్పాయి
అది తక్షణం తయారైంది అవతారమూర్తిని ఆహ్వానించడానికి
ఒడ్డులొరసి దూకుతున్న అలలు అర్ఘ్యపాద్యాలు యివ్వాలి
సముద్రపు చల్లగాలి ఎదురెళ్ళి స్వాగతం యివ్వాలి
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఆయన రావడమే తడవు
ఆనందంతో తను పెరిగింది ఆకాశమంత పొడవు

దీనిలోని సుదీర్ఘపాదాల శైలి కూడా ప్రవాహాలు జాలువారిన
స్ఫురణ కలిగించాయని విమర్శకులంటారు

No comments:

Post a Comment