Friday, November 24, 2017

ఒకే పద్యంలో కర్ణుని జీవితం


ఒకే పద్యంలో కర్ణుని జీవితం




సాహితీమిత్రులారా!

ఆంధ్రమహాభారతం శాంతిపర్వంలో
నారదుడు కర్ణుని గురించి ధర్మరాజు
కోరిక మేరకు చెబుతూ చెప్పిన పద్యం ఇది-
ఇందులో కర్ణుని జీవితం మొత్తం వివరింపబడింది-

వినుము నరేంద్ర! విప్రుఁడలివెన్, జమదగ్నిసుతుండు శాపమి
చ్చె, నమరభర్త వంచనముసేసె, వరంబని కోరి కుంతి మా
న్పె నలుక, భీష్ముఁడర్థరథుఁజేసె యడంచెఁ, గలంచె మద్రరా
జనుచితమాడి, శౌరి విధియయ్యె, నరండనిఁజంపెఁగర్ణునిన్
                                           (శ్రీమదాంధ్రమహాభారతం - శాంతిపర్వం - 1-35)

ధర్మరాజా! నేను చెప్పేది విని గ్రహించు, బ్రాహ్మణుడు కోపగించి
కర్ణుని శపించాడు తరువాత పరశురాముడు శపించాడు,
ఇంద్రుడు మోసంతో కవచకుండలాలు తీసుకున్నాడు,
కుంతి వరం అనే కారణంతో కోపాన్ని మాన్పింది,
భీష్ముడు అర్థరథునిగా చేసి అగౌరవపరిచాడు,
శల్యుడు అనుచితమైన మాటలతో హృదయాన్ని కలతపరిచాడు,
కృష్ణుడు అతడు దాటరాని విధియైనాడు, ఇన్ని జరిగితే
యుద్ధంలో అర్జునుడు కర్ణుని రణరంగంలో వధించాడు.

No comments:

Post a Comment