Friday, November 17, 2017

ఎన్నో రాత్రులు శ్మశానాల్లో గడిపాను


ఎన్నో రాత్రులు శ్మశానాల్లో గడిపాను




సాహితీమిత్రులారా!

భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకాన్ని చూడండి-

ఉత్ఖాతం నిధిశఙ్కయా క్షితితలం, ధ్మాతా గిరేర్ధాతవో,
విస్తీర్ణస్సరితాంపతి, ర్నృపతయో యత్నేన సంతోషితాః,
మన్త్రారాధనతత్పరేణ మనసా నీతాః శ్మశానే నిశాః,
ప్రాప్తః కాణవ రాటకో పి న మయా తృష్ణే! సకామా భవ

నిధి నిక్షేపాలు పూర్వులెవరో దాచి ఉంచుతారని విని ఆశగా
నేల చెడత్రవ్వాను. బంగారం మీది వ్యామోహంతో కొండలమీద
లభ్యమయ్యో మణిశిలవంటి ధాతువుల్ని కరిగించాను. ఎక్కడో
దూరదేశాల్లో సంపదలున్నాయని ఆత్రంగా సముద్రాలమీదికి
ప్రయాసతో ప్రయాణించి, రాజులకొలువు చేసి వార్నికనిపెట్టి సదా
ఇష్టుడిగా మెలిగాను. మంత్రాలతో ఎక్కడెక్కడి ఐశ్వర్యాలూ
వశమౌతాయని ఆశించి రాత్రులెన్నో శ్మశానాల్లో గడిపాను.
ఏదీ గుడ్డిగవ్వయినా లభించిందా ఈ తపన ఇక చాల్లే - అని భావం

No comments:

Post a Comment