Sunday, February 6, 2022

క్షీరసాగర మథనం అంటే.........

 క్షీరసాగర మథనం అంటే.........



సాహితీమిత్రులారా!



గణపతివాశిష్ఠముని కృత

ఉమాసహస్రంలోని 1వ స్తబకములో

వివరించబడిన అమృత మథన

అంతరార్థం రెండు శ్లోకాలలో కలదు అవి-


ప్రాణిశరీరం మన్దరశైలొ

మూలసరోజం కచ్ఛపరాజః

పూర్ణమనన్తం క్షీర సముద్రః

పృష్ఠగవీణా వాసుకురజ్జుః


ప్రాణిశరీరం - మందర పర్వతం

మూలాధార కమలము - కచ్ఛపరాజు(కూర్మరాజు)

పూర్ణమగు ఆకాశము -

దహరము అను హృదయము క్షీరసముద్రము

వెన్నెముకగల వీణాదండము -వాసుకి యగు త్రాడు


దక్షిణనాడీ - నిర్జరసేనా

వామగనాడీ - దానవసేనా

శక్తివిలాసో - మన్ధనకృత్యం

శీర్షజధారా - కా2పిసుధోక్తా

దక్షిణనాడి - దేవసేన

వామగనాడి - అసుర సేన

శక్తివిలాసము - మన్ధనకృత్యము

శీర్షజమను నొకానొక ధార - అమృతము.


శరీరము మధ్యనున్న సుషుమ్నా నాడికి అపసవ్యమున ఉన్న

పింగళ అను పేరుగలనాడి దక్షిణనాడి - దేవతలసేన అగుచున్నది

ఆ సుషుమ్నకు సవ్యభాగమున ఉన్న ఇల లేక ఇడా అనే నాడి

వామగ నాడి - ఇది అసురసేన అగుచున్నది. శక్తి యొక్క క్రీడయే

మధనమను కార్యము అగుచున్నది.

సహస్రారకమలమునుండి వెలువడిన అనిర్వచనీయమైన

ఆనందధారయే అమృతము - అని చెప్పబడుచున్నది.


No comments:

Post a Comment