Wednesday, February 7, 2018

తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు


తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు




సాహితీమిత్రులారా!


పండిత జగన్నాథుని పేరు సుపరిచితమేకదా
ఆయన తన "ప్రాణాభరణ" కావ్యంలో
తాను తెలుగువాడినని సగర్వంగా
చాటాడు. ఆ శ్లోకం చూడండి-

త్రైలింగాన్వయ మంగళాలయ మహాలక్ష్మీదయాలాలితః
శ్రీమత్పేరమభట్టసూను రనిశం విద్వల్లలాటంతపః
సంతుష్టః కమతాధిపస్య కవితామాకర్ణ్య తద్వర్ణనం
శ్రీమత్పండితరాజ పండితజగన్నాథోవ్యధాసీ దిదం

నేను తెలుగువాడిని. లక్ష్మీకృపాలాలితుడను
శ్రీమంతుడగు పేరు భట్టారకుని కుమారుడను
విద్వల్లలాటంతపుడను, పండితరాయ బిరుదాంకితుడను.
కామరూపాధీశ్వరుని కవిత్వం విని సంతుష్టుడనై
అతని గుణాలను వర్ణిస్తూ నేనీ కావ్యాన్ని రచించాను-
అని భావం.
మన రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు -
ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతినిండుగౌరవము
అవమానమేలరా, అనుమానమెల, భరతపుత్రుండనంచు భక్తి తొబలుక.
- అని దేశభక్తి కలవానిగా ఈ కవిగూడ తనదేశం తన భాషనుగురించి
చాటుకోవడం ఈ తరంవారు మరువకూడదనే విషయాన్ని
ఈ శ్లోకం చెబుతున్నదికదా!

No comments:

Post a Comment