Friday, December 30, 2022

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' పాట వెనుక కథ!

 జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' పాట వెనుక కథ!




సాహితీమిత్రులారా!

పూర్వం తల్లులు తమ చంటిబిడ్డలకు అన్నం పెట్టాక, ఆ అన్నం త్వరగా జీర్ణంకావాలని, తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనీ అంటూ ఓ పాట పాడేవారు. ఆ పాట..

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!

గుఱ్ఱాలు తిన్న గుగ్గిళ్లరిగి,

ఏనుగులు తిన్న వెలక్కాయలరిగి,

అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి,

భీముడు తిన్న పిండివంటలరిగి,

గణపతి తిన్న ఖజ్జాలరిగి,

అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి,

పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి,

నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు,

ఏనుగంత సత్తువు ఉండేటట్టు

సాకుమీ, యీ బిడ్డను సంజీవరాయా!

ఇదీ ఆ పాట. 

ఈరోజు మనం ఈ పాట వెనుకనున్న కథను చెప్పుకుందాం!

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment