Tuesday, October 4, 2022

నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?

 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?




సాహితీమిత్రులారా!

కాళిదాసు భోజరాజు ఆస్థానంలో మొదటిసారి ప్రవేశించే సమయంలో కొందరు పండితులు అడ్డుపడతారు. వారికి బుద్ధి చెప్పడానికన్నట్టుగా నోరుతిరగడం కష్టమైన అయిదు పద్యాలను చెప్పి, వాటిని తిరిగి చెప్పమంటాడు కాళిదాసు. చదువుతుంటే మధ్యమధ్యలో నాలుక మడతపడేలా ఉండే ఆ పద్యాలు చెప్పలేక చేతులెత్తేస్తారు ఆ పండితులు. అలా కాళిదాసు ప్రతిభకు తార్కాణం నిలచిపోయాయా పద్యాలు. ఆ పద్యాల అర్థాల గురించి ఇంత వరకూ ఏ పుస్తకాలలోనూ రాలేదు కానీ, పిల్లలకు నోరు తిరగడానికి వాటిని భట్టీయం వేయించడం మాత్రం పూర్వపురోజుల్లో ఉండేదట. అలాంటి క్లిష్టమైన పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. అంతేకాక అటువంటి కష్టమైన పద్యాన్ని చాలా సులువుగా ఎలా భట్టీయం వేసి అప్పచెప్పవచ్చో కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ పద్యం.

షడ్జామడ్జఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చమడ్ఖా ఖరే

జడ్జట్కిట్కి ధరాడ్ధరేడ్ఫునఘనః ఖడ్జోతవీడ్యడ్భ్రమా

వీడ్యాలుడ్భ్రమలుట్ప్రయట్ట్రయ పదాడడ్గ్రడ్గ్రడడ్గ్రడ్గ్రహా

పాదౌటేట్ప్రటటట్ప్రటట్ప్రటరసత్ప్రఖ్యాత సఖ్యోదయః

ఇదీ ఆ పద్యం. మొదటి రెండు పాదాలూ కష్టం మీద పలకొచ్చుకానీ, మూడూ నాలుగు పాదాలను చూస్తే మాత్రం భయం వేస్తుంది. అయితే ఇటువంటి పద్యాలలో పలకడానికి కష్టంగా ఉన్న పదాలను విడదీసి వ్రాసుకుని చదివితే.. అప్పుడు మనకు సులభంగా నోరుతిరుగుతుంది. అటుపై ఆ పదాలనే వేగంగా పలకడం సాధన చేస్తే సరిపోతుంది. మనకు లెక్కల్లో కూడా చూడండి.. పదహారుని ఇరవైమూడుతో గుణిస్తే ఎంత అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి. మనం అప్పుడు ముందు మూడుతో పదహారుని గుణించి, ఆ తరువాత రెండుతో దుణించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో వ్రాసి కూడతాం. కానీ అంతకన్నా సులువైన పద్ధతి ఒకటుంది. 23ని ఇరవైగా మూడుగా విడదీస్తే.. పదహారు ఇరవైలు 320, పదహారు మూళ్ళు 48. ఈ రెండూ కలిపితే 368. ఇలా చెయ్యాలన్నా కొంత సాధన చెయ్యాలి. కానీ ఈ విధానం అంతకు ముందు విధానం కన్నా సులభమైనది. అలానే పద్యం విషయంలో కూడా. ఈ పద్యాన్ని మనం ఇలా విడదీసి వ్రాసుకుందాం.


Rajan PTSKగారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment