Saturday, June 26, 2021

కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

 కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2





సాహితీమిత్రులారా!



కాశీమజిలీ కథల్లో మణిసిద్ధుడు, గోపడు ఇద్దరూ ఊరూరూ

మజిలీలు చెస్తూ వెళుతున్నారు కాశీకి. మధ్యలో కనపడ్డ

వింతలు విశేషాలూ వివరిస్తున్నాడు గోపనికి మణిసిద్ధుడు.

ఇలా వెళుతూండగా ఒకఊరిలో గోడమీద క్రింది పద్యం

చూశాడు శిష్యుడు(గోపడు) ఈ పద్యం పై ఒక బొమ్మకూడ

ఉంది. ఆ పద్యం-


భూపతిఁజంపితిన్, మగఁడు భూరిభుజంగము చేతఁజచ్చె, నే

నాపదఁజెంది చెంది యుదయార్కుని పట్టణముఁజేరి వేశ్యనై

పాపము గట్టుకొంటి, తన పట్టి విటుండయి కౌఁగిలింప, సం

తాపముఁబొంది, యగ్గిఁబడి, దగ్ధనుగా, కిటు గొల్లభామనై

యీ పని కొప్పుకొంటి, నృపతీ వగపేటికిఁజల్ల చిందినన్


దీన్ని చూచిన తరువాత గోపనికి కొండెత్తు కుతూహలం పెరింది

ఈ బొమ్మేమిటి, ఈ పద్యమేమిటి, ఇందులో ఎన్నో సన్నివేశాల

ప్రసక్తి ఉంది. దాని పూర్వాపరాలేమిటి

ఈ గొల్లభామ ఏ భూపతిని చంపింది

ఆమె మగడు ఎందువల్ల పాముకాటుతో మరణించాడు

వారికి పుట్టిన కుమారుడెక్కడ పెరిగాడు

ఆమె వేశ్యగా ఎందుకు మారింది

ఆమె దగ్గరకే ఆమె కొడుకు విటునిగా ఎందుకొచ్చాడు

ఇవన్నీ తెలిసి తెలిసి అగ్నిప్రవేశం చేయకుండా

ఎందుకు చల్లనెత్తుకొంది

అందులోంచి చల్లచిందితే ఏ నృపతి ప్రశ్నించాడు

శిష్యుడు వేసిన ప్రశ్నలన్నిటికి గురువుగారు మణిసిద్ధుడు

పూసగ్రుచ్చినట్లు సమాధానం చెప్పాడు ఇదంతా వింటుంటే

చదువుతుంటే ఎంత ఆసక్తికా కథాకథనం వుందో మదిర

సుబ్బన్నదీక్షితుల గొవ్వభామ కథలో


   ఈ పద్యంలోని సంఘటనలుగాని, ఇందులోని కల్పనలుగాని

సుబ్బన్నదీక్షితులు సృష్టించిన కల్పనలుకాదు. ఇందులోని

కథాకథనమే వారిది. ఈ పద్యం మూలశ్లోకం రసిక జీవనం అనే

సంస్కృత ప్రబంధంలో ఉంది.


ఆ శ్లోకం-

హత్వా నృపంపతి మవేక్ష్య భుజంగదష్టం

దేశాంతరే విధివశాద్ గణికాస్మితాజాతా

పుత్రం భుజంగ మధిగమ్యచితాం ప్రవిష్టా

శోచామి గోపగృబిణీ కథ మద్యతక్రమ్


రసిక జీవనం కంటే ప్రాచీనమైన ఇంకొక సంస్కృత సంకలన గ్రంథం

ఒకటుంది. దానిపేరు ప్రబంధ చింతామణి దాన్లో రెండవ ప్రకరణంలోని

12వ శ్లోకంలో ఉన్న గోపగృహిణీ ప్రబంధం ఈ కథకుమూలమని

చాటుపద్య రత్నాకంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు పొందుపరిచారు.

ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు మూలశ్లోకాన్ని

వివరాలుతెలిపారట. కాశీమజిలీ కథలు కపోల కల్పితాలు కావని

దీని బట్టి తెలుస్తున్నది.

No comments:

Post a Comment