Friday, August 18, 2017

గురువని ఎవరిని సంబోధంచాలి?


గురువని ఎవరిని సంబోధంచాలి?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
గురువెవరో ఎవరిని పిలవాలో-
మనవాళ్లు కనబడిన ప్రతివారిని
"గురు" పదంతో పిలుస్తుంటారు.
అది సరైందికాదట-

ఉపాధ్యాయాన్ దశాచార్యః
ఆచార్యాణాం శతం పితా
సహస్రంతు పిత్రూన్ మాతా
గౌరవే ణాతిరిచ్యతే

గురువని అందరినీ సంబోధించటం సరైనదికాదు.
దీనిలో రకాలున్నాయి. పదిమంది ఉపాధ్యాయుల
కంటే ఒక ఆచార్యుడు మిన్న. నూరుగురు ఆచార్యుల
కంటే తండ్రి మిన్న. అటువంటి వెయ్యిమంది తండ్రుల
కంటే ఒక తల్లి మిన్న. కనుకనే తల్లిని ప్రథమగురువంటారు.
అందరికంటే మిన్నగా గౌరవించదగినది తల్లియే - అని భావం.

No comments:

Post a Comment