Thursday, November 24, 2022

దేవీ అశ్వధాటి స్తోత్రం, తాత్పర్యము

 దేవీ అశ్వధాటి స్తోత్రం, తాత్పర్యము




సాహితీమిత్రులారా!

సృజనాత్మకతను, రచనా శక్తిని పెంపొందించే దేవీ అశ్వధాటీ స్తోత్రం, అర్థముతో సహా!

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

అంటూ.. వాక్కు, అర్థము ఒకదానిని విడిచి, మరొకటి ఎలా ఉండలేవో, అలాంటి కలయికే కలిగి, అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే ఆ ఆదిదంపతులను, తనకు శబ్దార్థ జ్ఞానము అనుగ్రహించమంటూ, తన రఘువంశ మహాకావ్య ప్రారంభానికి ముందు, ప్రార్థించాడు, మహాకవి కాళిదాసు. ఇప్పటికీ ఎంతోమంది, తమ రచనలు ప్రారంభించే ముందు, ఈ శ్లోకాన్నే  ప్రార్థనా శ్లోకంగా వాడటం పరిపాటి. 

అలానే, వేరొక సందర్భంలో.. ఆ మహాకవి, తనకు ఆశుకవితాశక్తిని ప్రసాదించమంటూ, ఆ జగన్మాతను, అద్భుతమైన రీతలో స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నడక ఎలా ఉండాలో, ముందుగానే కాళిదాసు నిశ్చయించుకోవడం వల్ల అశ్వధాటీ వృత్తంలో  రచన సాగించాడు. అందుకే ఈ 13శ్లోకాల నడకలోనూ ఆ సొగసు, ధాటి కనబడుతుంది. పండితపామర జనరంజకమైన ఈ శ్లోకాలను చదువుతుంటే.. కవులైన వారికి, తమకూ ఇలాంటి రచన ఒకటి చెయ్యాలనిపిస్తుంది. పామరులకు ఇలాంటి స్తోత్రాలు మరిన్ని వినాలనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. అందరికీ ఈ స్తోత్రం హృదయోల్లాసాన్ని కలిగిస్తుంది. అలానే.. హృదయాన్ని అమ్మ పాదపద్మాలపై ఉంచి, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల, ఆ జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి, ఆశుకవితా శక్తి కలుగుతుందన్నది ఋుషులవంటి మన పెద్దలు చెప్పినమాట. ముందుగా ఆ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుని, తరువాత ఒక్కో శ్లోక భావాన్నీ సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇక దేవీ అశ్వధాటి స్తోత్రాన్ని మొదలు పెడదాం..

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment