Monday, November 14, 2022

పొన్నియిన్ సెల్వన్ కు నన్నయ భారతానికీ ఉన్న సంబంధం ఏమిటి?

 పొన్నియిన్ సెల్వన్ కు నన్నయ భారతానికీ ఉన్న సంబంధం ఏమిటి?




సాహితీమిత్రులారా!

క్రీ.శ. 955 ప్రాంతంలో తంజావూరుని రాజధానిగా చేసుకుని గండరాదిత్యచోళుడు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు తన తమ్ముడైన అరింజయచోళునితో కలసి అధికారం పంచుకుంటూ పరిపాలన చేశాడు. ఈ గండరాదిత్యుని కొడుకు మధురాంతక ఉత్తమచోళుడు. అయితే గండరాదిత్యుడు, అరింజయచోళుడు మరణించాక, అరింజయుని కుమారుడైన సుందరచోళుడు సింహాసనమెక్కాడు. ఈ సుందరచోళునికి ఆదిత్య కరికాలన్, అరుణ్మోలివర్మన్ అనే ఇద్దరు కుమారులు, కుందవై అనే కుమార్తె పుట్టారు. సుందరచోళుని తరువాత చోళ సామ్రాజ్యానికి వారసుడు అతని పెద్ద కొడుకైన ఆదిత్యకరికాలన్. ఈ ఆదిత్య కరికాలన్ చాలా పరాక్రమశాలి. యుద్ధాలలో ఆరితేరినవాడు. పాండ్యరాజైన వీరపాండ్యుని యుద్ధంలో ఓడించి, పారిపోతున్న అతగాడిని వెంటాడి మరీ తల నరికాడు. ఆ సంఘటన పాండ్యదే శరాజభక్తుల రక్తాన్ని ఉడికించింది. ఎలా అయినాసరే ఆదిత్యకరికాలుని హత్యచేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. మరోప్రక్క గండరాదిత్యుని కుమారుడైన మధురాంతక ఉత్తమచోళుడు కూడా తాను సింహాసనం ఎక్కడానికి పావులు కదపసాగాడు. మొత్తం మీద అనేక కుట్రల ఫలితంగా ఆదిత్యకరికాలన్ హత్య చేయబడ్డాడు. ఈ ఆదిత్య కరికాలన్ యువరాజుగానే కాక, రాజుగా కూడా కొద్దికాలంపాటూ రాజ్యపాలన చేశాడన్నది కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment