Thursday, September 22, 2022

సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు

 సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు 




సాహితీమిత్రులారా!

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః

కృపః పరుశరామశ్చ సప్తైతే చిరంజీవినః

అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ ఏడుగురినీ సప్త చిరంజీవులంటారు. ఈ సప్త చిరంజీవులతో పాటూ మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకునేవారు సర్వవ్యాధులనుండీ రక్షణ కలిగి, అపమృత్యు భయంలేకుండా, నిండు నూరేళ్ళూ జీవిస్తారన్నది పెద్దలు చెప్పిన మాట.  చిరంజీవి అంటే చిరకాలం పాటూ జీవించేవాడు అని అర్థం. మనం ఈరోజు ఆ చిరంజీవులందరి కోసం సంగ్రహంగా చెప్పుకుందాం. 

Rajan PTSKగారికి ధన్యవాదాలు


No comments:

Post a Comment