Sunday, September 11, 2022

కన్యాశుల్కం నాటకం 2వ భాగము

 కన్యాశుల్కం నాటకం 2వ భాగము




సాహితీమిత్రులారా!

కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం

క్రితం భాగంలో మనం మధురవాణి, గిరీశం, రామప్ప పంతులు, పూటకూళ్ళమ్మ, వెంకటేశం మొదలైన పాత్రలతో నడిచిన కన్యాశుల్కం ప్రథమాంకాన్ని చెప్పుకున్నాం. వెంకటేశానికి చదువు చెప్పే మిషతో గిరీశం వెంకటేశంతో పాటూ వాళ్ళ అగ్రహారానికి బయలుదేరివెళ్ళడంతో ప్రథమాంకం ముగుస్తుంది. ఈ ప్రథమాంకంలో వచ్చిన పాత్రలలో ముఖ్యమైనవి మాత్రం మధురవాణి, రామప్పపంతులు, గిరీశం. ఇందులో మధురవాణి ఒక వేశ్య, రామప్ప పంతులు రామచంద్రపురం అగ్రహారం కరణం, ఇక గిరీశం గురించి చెప్పేదేముంది. తన తెలివితేటలతో వాక్చాతుర్యంతో అవతలివారిని బురిడీకొట్టిస్తూ బ్రతికే జిత్తులమారి పాత్ర అతనిది. ఇక ఈ ద్వితీయాంకంలో మనకు వెంకటేశం తండ్రి, కృష్ణరాయపురం అగ్రహారీకుడూ అయిన అగ్నిహోత్రావధాన్లు, ఆ అగ్నిహోత్రావధాన్లు భార్య వెంకమ్మ, కూతురు బుచ్చమ్మ, బావమరిది కరటక శాస్తుల్లు, ఆ కరటకశాస్తుల్ల శిష్యుడు ప్రధానంగా కనబడతారు. ఈ కరటక శాస్త్రులు విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు. ఇక ద్వితీయాంకంలోకి  ప్రవేశిద్దాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment