Monday, April 13, 2020

విమర్శకుని ప్రత్యేకత


విమర్శకుని ప్రత్యేకత



సాహితీమిత్రులారా!


నన్నయ రాజరాజును సంబోధిస్తూ రాసిన పద్యం ఇది.

శ్రీరమణీప్రియ, ధర్మవి
శారద, వీరావతార. సౌజన్య గుణా
ధార భువనైక సుందర
వీర శ్రీరమ్య బుధ వివేక నిధానా (సభా-2-1)

నన్నయ సామాన్యంగా శ్లేషనుగాని, చమత్కారాన్నిగాని పాటించడు.
మరి ఈపద్యంలో నన్నయ వాడిన విశేషణాలు రాజరాజు గుణగణాలను
కీర్తించినవే కానీ ఓప్రతిభా విమర్శకుడు చేసిన విమర్శను చూడండి.

శ్రీరమణీప్రియ - శ్రీకృష్ణుడు,
ధర్మవిశారదుడు - ధర్మరాజు,
వీరావతారుడు - భీముడు,
సౌజన్యగుణాధారుడు - అర్జునుడు,
భువనైకసుందరుడు - నకులుడు,
బుధవివేకనిదానుడు - సహదేవుడు - అని వివరించాడు.
కవి భావనలోని విశేషాలను చమత్కారాలను విమర్శకులు చాతుర్యంగా
విపులీకరించగలరని దీన్ని బట్టి అర్థమౌతుంది.

అందుకేనేమో
"కప్పిచెప్పేవాడు కవి - విప్పి చెప్పేవాడు విమర్శకుడు" -  అనే  నానుడి వచ్చింది

No comments:

Post a Comment