బుచ్చిబాబు రచన-
నన్ను గురించి కథ వ్రాయవూ!
సాహితీమిత్రులారా!
బుచ్చిబాబుగారి కథ -
నన్ను గురించి కథ వ్రాయవూ!
కథనం, పరిచయం, విశ్లేషణ - కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బుచ్చిబాబుగారి కథ -
నన్ను గురించి కథ వ్రాయవూ!
కథనం, పరిచయం, విశ్లేషణ - కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
భాగవతంలో భగవంతుని స్వరూపం ఎక్కడ ఏవిధంగా ఉందో
కౌశికసంహితలో ఈ విధంగా వివరించారు-
మొదటి స్కంధంలో శ్రీకృష్ణుని పాదాలనుండి మోకాళ్ళవరకు
ద్వితీయ స్కంధంలో కటి (మొల) పర్యంతం
తృతీయస్కంధంలో నాభి(బొడ్డు)
చతుర్థస్కంధంలో ఉదరభాగం
పంచమస్కంధంలో హృదయం
షష్ఠమస్కంధంలో కంఠం
సప్తమస్కంధంలో ముఖం
అష్టమస్కంధంలో కన్నులు
నవమస్కంధంలో బుగ్గలు కనుబొమలు
దశమస్కంధంలో బ్రహ్మరంధ్రము
ఏకాదశస్కంధంలో మనస్సు
ద్వాదశస్కంధంలో ఆత్మ
ఉన్నాయని వివరించింది
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి
తెలుగు ఆడియో బుక్
నుండి మనిషికి మనిషికి మధ్య(కథ)
ఆనే కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బ్రహ్మ తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? ?
ఈ విషయమై నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
నమస్కారం గొప్పదనాన్ని తెలియచేస్తూ
కువలయానందం అనే అలంకారశాస్త్రంలో
అప్పయ్య దీక్షితులవారు
ఈ పద్యం చెప్పారు గమనించగలరు-
వపుః ప్రాదుర్భావతః అనుమితమిదం జన్మని పురా
పురారే న క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్
నమన్ముక్తః సంప్రత్యహమతనుః అగ్రేప్యనతిమామ్
ఇతీశ క్షంతవ్యం తదిదం అపరాధ ద్వయమపి
ఓ పరమేశ్వరా! రెండు తప్పులను చేశాను క్షమించు.
గత జన్మలో నేను నమస్కరించకపోవడం వల్ల ఇప్పుడు
జన్మనెత్తాను. ఈ జన్మలో నేను నీకు నమస్కరిస్తే ఇక జన్మ
ఉండదు కనుక అపుడు నీకు నమస్కరించే అవకాశం
లేదు కదా కనుక నా తప్పులను క్షమించు - అని భావం
సాహితీమిత్రులారా!
ప్రతి ఒక్కరు పతివ్రతల పేర్లు చెప్పినపుడు
ద్రౌపది పేరు చెబుతారు. కాని అనుమానం
5 మంది భర్తలున్న ద్రౌపది పతివ్రతా?
ఈ సందేహాన్ని నివారించే ప్రయత్నం చేసిన
నండూరి శ్రీనివాస్ గారి వీడియో
వీక్షించండి
సాహితీమిత్రులారా!
రాళ్ళబండి కవితాప్రసాద్ గారి
ఒక ప్రయాణం కథ
మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం తరువాత శ్రీకృష్ణుడు
రాధను కలుసుకోవడాని ఒక ప్రయాణం
కథనం కిరణ్ ప్రభ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ఏ పూవులను ఎవరి పూజకు ఉపయోగించాలో
ఇక్కడ కొంత విషయాన్ని తెలుసుకుందాం-
గణేశం తులసీ పత్రైః నవదుర్గాశ్చైవ దూర్వయా,
ముని పుష్పైః తథా లక్ష్మీకామో నచార్చయేత్
సంపదలపైన ఆపేక్షకలిగి దేవతలను పూజింపగోరేవారు తులసీ దళాలతో వినాయకుని, నవదుర్గలను, పార్వతిని పూజించరాదు. అవిశపూలతో సూర్యుని పూజింపరాదు అలా చేస్తే సంపదంతా పోయి ఏడేళ్ళు జ్యేష్టాదేవి ఇంటనిలుస్తుంది
జపా కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ భవైః
కేతకీ భవ పుష్పశ్చ నై వార్చ్యః శంకర స్తథా
జపా, మొల్ల, దిరిసెన, మాలతీ, మొగలి పూలతో శివార్చన చేయరాదు
శిరీ షోన్మత్త గిరిజా, మల్లికా శాల్మలీ భవైః
అర్కజైః కర్ణికారశ్చ, విష్ణు నార్చ్యః సితాక్షతైః
దిరిసెన, ఉమ్మెత్త, కొండమల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు - ఈ పూలతో మహావిష్ణువును పూజించరాదు. శూన్యఫలం. అంతేగాక తెల్లవిగాని, కుంకుమ, పసుపు కలిపిన అక్షతలు కూడ విష్ణువుకు ఉపయోగించరాదు. ఆ ఇంట లక్ష్మి ఉండదు. అపరిశుభ్రంగా, చేతులతో, గుడ్డలో కట్టుకు తెచ్చిన పూలు, భక్తిలేని అర్చనలు దైవానికి సమర్పితం కానేరవు.
సాహితీమిత్రులారా!
భూదేవి విష్ణువు భార్యకదా
మరి భూదేవి కుమార్తె సీత
రామునికి ఎలా భార్య అయింది
ఈ వీడియో చూడండి -
సాహితీమిత్రులారా!
రెడ్డిరాజుల యుగంలో ఉన్న బడబానల భట్టు
ఏవూరివాడో తెలియదు కాని ఒకసారి ఆయన
త్రిపురాంతకం నుండి శ్రీశైలం వెళుతూ
ఒకచోట మకాం చేశాడు. తెల్లవారుజామున స్నానం చేసి
సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నపుడు చేతి ఉంగరం జారి చెరువులో పడింది
వెంటనే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం చెప్పాడు
బడబానల భట్టారకు
కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
బిడువేళ నూడి నీలో
బడియె దటాకంబ నీటి బాయుము వేగన్
ఈ పద్యం చెప్పిన రెండు గడియలలో చెరువు ఎండిందట
కవిగారు తన ఉంగరం తీసుకొని చక్కాపోయాడు- అని
అప్పకవి తన అప్పకవీయంలో ఈ పద్యాన్ని పొందుపరిచాడు.
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కృష్ణ పక్షంలోని
కవిత నా జీవితము - ఆస్వాదించండి-
వింతగా దోచు నాదు జీవితము నాకె!
జిలుగు వెన్నెలతో చిమ్మచీకటులతొ;
అమల మోహన సంగీతమందు హృదయ
దళన దారుణ రోదన ధ్వనులు విందు;
వక్రగతి బోదు చక్కని పథమునందె,
రాజపథమునకై కుమార్గమున జూతు;
గరళమేతిందు కడుపార నెరిగి యెరిగి;
అవల ద్రోతు చేతులార నమృతరసము;
విస మమృతమట్టు లమృతంబు విసమురీతి;
చిత్రచిత్రగతుల మార్చు జీవితంబు!
సాహితీమిత్రులారా!
అమ్మ చెబితే వినాలి(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు
సాహితీమిత్రులారా!
సంస్కృతంలో పంచకావ్యాలున్నట్టే తెలుగులో కూడ
ఐదు ప్రౌఢప్రబంధాలను పంచకావ్యాలు అంటారు.
అవి 1. మనుచరిత్ర, 2. వసుచరిత్ర, 3. రాఘవపాండవీయం,
4. శృంగారనైషధం, 5. ఆముక్తమాల్యద
ఇవికాకుండా పంచడప్పులనేవి బ్రౌన్ దొరగారి కాలంలో వెలుగులోకొచ్చాయి.
ప్రామాణిక పురాణాలలోని ప్రక్షిప్తాలను ఆధారం చేసుకొని ఆ పురాణపురుషులకు అంటగట్టి వ్రాసే కేవల కల్పనాకథలను పంచడప్పులు అంటారు - అని బ్రౌన్ దొరగారి పండితుల కథనం
పురాణడప్పులుగా చెప్పబడేవి 5
1. మైరావణ చరిత్ర,
2. శతకంఠ రామాయణం,
3. కృష్ణార్జున సంవాదం,
4. గంగాగౌరీ సంవాదం,
5. జైమినీ భారతం
జైమినీ భారతాన్ని తరువాతి కాలంలో తొలగించి
కుశలవ కథ ను చేర్చారు బ్రౌన్ దొరవారు.
సాహితీమిత్రులారా!
నాన్న(కథ)
రచన - యమ్. వెంకటేశ్వరరావు